Gill - Anderson: మా మధ్య ఏమైందంటే? గిల్తో మాటల యుద్ధంపై జేమ్స్ అండర్సన్
సిరీస్ చివర్లో టీమ్ఇండియా ఆటగాడు శుభ్మన్ గిల్ - ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ను (IND vs ENG) 4-1 తేడాతో టీమ్ఇండియా చిత్తు చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత యువ ఆటగాడు శుభ్మన్ గిల్ - ఇంగ్లిష్ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అప్పుడు ఏం జరిగిందనేది గిల్ మ్యాచ్ అనంతరం చెప్పలేదు. తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ అప్పుడేం జరిగిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘భారత్ వెలుపల నువ్వేమైనా పరుగులు చేశావా? అని నేను అన్నా. దానికి బదులుగా ‘ఇక నువ్వు రిటైర్ కావాల్సిన సమయం వచ్చింది’ అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత రెండు బంతులకే నేను గిల్ను ఔట్ చేశా. మరో ఆటగాడు కుల్దీప్ యాదవ్ వికెట్ను నేనే తీశా. అది నాకు టెస్టుల్లో 700వ వికెట్. అంతకుముందే కుల్దీప్ ఓ మాట అన్నాడు. ‘నాదే నీకు మైలురాయి వికెట్’ అవుతుందని చెప్పాడు. మేమిద్దరం దానికి నవ్వుకున్నాం’’ అని అండర్సన్ గుర్తు చేశాడు. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో శుభ్మన్ గిల్, కుల్దీప్ కీలక పాత్ర పోషించారు. గిల్ సెంచరీతో అలరించాడు. కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ఇన్నింగ్స్ తేడాతో టీమ్ఇండియా గెలిచింది. భారత బ్యాటర్లు భారీగా పరుగులు చేసిన ఆ పిచ్పై ఇంగ్లాండ్ ఆటగాళ్లు తేలిపోయారు.
సిక్స్ కొట్టి.. ఆ తర్వాత ఔటై..
అద్భుతమైన ఆటతీరుతో శుభ్మన్ గిల్ ఇంగ్లాండ్తో సిరీస్లో రెండు సెంచరీలు చేశాడు. ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్లోనూ శతకం సాధించాడు. అండర్సన్ బౌలింగ్లోనూ భారీ షాట్లు కొట్టాడు. తాను వేసిన బంతిని గిల్ సిక్స్గా మలచడంతో అండర్సన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీంతో తన నోటికి పని చెప్పాడు. మరోవైపు గిల్ కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత బంతికే గిల్ను జిమ్మీ ఔట్ చేశాడు. టెస్టుల్లో గిల్ను 6 సార్లు అండర్సన్ ఔట్ చేయడం గమనార్హం. ఇదే మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను కూడా భారత యువ ఆటగాడు వదల్లేదు. మాటలతో తికమక పెట్టి పెవిలియన్కు చేరేలా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్