IND vs BAN: రాహుల్.. ఆ విషయంపై ఇంకోసారి ఆలోచించుకో: నెట్టింట ట్రోలింగ్
బంగ్లాతో తొలి టెస్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) ప్రదర్శన మరోసారి విమర్శలపాలైంది. అన్ని ఫార్మాట్లలో ఒకే విధంగా ఆడుతున్నాడంటూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు.
చట్గావ్: బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్(IND vs BAN)లో భాగంగా తొలి మ్యాచ్లో కేఎల్ రాహుల్ పేలవమైన ప్రదర్శన చేసి మరోసారి అభిమానులు ఆగ్రహానికి గురయ్యాడు. ఈ మ్యాచ్లో భారత్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. రాహుల్(KL Rahul) శుభ్మన్గిల్తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే, ఖలీద్ అహ్మద్ తన బౌలింగ్తో రాహుల్ను కట్టడి చేశాడు. గిల్, విరాట్(Virat kohli) సైతం తైజుల్ ఇస్లామ్ చేతికి చిక్కారు. తొలి మ్యాచ్లో రోహిత్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్గా ఎంపికైన రాహుల్ రాణిస్తాడని అంతా భావించారు. కానీ, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్కి ఆవల వేసిన బంతిని ఆడబోయి క్లీన్బౌల్డ్గా పెవిలియన్కు చేరాడు.
దీంతో తీవ్ర అసహనానికి గురైన రాహుల్ బ్యాట్పై పంచ్ ఇచ్చాడు. అతడు 54 బంతులను ఎదుర్కొని 22 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్లో ఇంత తక్కువ స్కోరుతో వెనుదిరిగిన ఏకైక కెప్టెన్ రాహులే అయ్యుంటాడంటూ అతడిపై మండిపడుతున్నారు. అన్ని ఫార్మట్లలో ఒకే విధంగా ఆడుతూ అభిమానుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాడంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇలాంటి ఆటగాళ్లకు అవకాశం ఇస్తోందంటూ బీసీసీఐని తప్పుపడుతున్నారు.
‘‘డియర్ రాహుల్, నువ్వు స్ట్రైట్గా ఆడటం మర్చిపోయావు. అదే నిన్ను చిక్కుల్లో పడేస్తోంది. నువ్వు కొంత కాలం ఆటనుంచి విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ ద్రవిడ్ ఆటను చూస్తే ఓపికగా ఉంటూ స్ట్రైట్గా ఆడటం ఎలాగో తెలుస్తుంది. ఒకసారి ఈ విషయంపై ఆలోచించు’’ అంటూ ఓ అభిమాని ట్విటర్ ద్వారా అవేదన వ్యక్తం చేశాడు. ‘‘టెస్టు క్రికెట్లో మనదేమీ ఇంగ్లాండ్ జట్టు కాదు. కాస్త శ్రద్ధగా ఆడండి’’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?