Cricket News: టీ20ల్లో ఆడటంపై స్పష్టతనిచ్చిన షమి.. ‘ఉమ్రాన్ మాలిక్ ఎక్కడ’?
భారత పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami) టీ20ల్లో తన భవితవ్యంపై స్పందించాడు. ఉమ్రాన్ మాలిక్ను టీమ్ఇండియాకు ఎంపిక చేయకపోవడాన్ని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి (Mohammed Shami)కి అన్ని ఫార్మాట్లలోనూ సత్తాచాటే సామర్థ్యముంది. అతడి గణాంకాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఐపీఎల్లోనూ రాణిస్తున్నాడు. కానీ, కొంతకాలంగా అంతర్జాతీయ టీ20లకు తనని ఎంపిక చేయడం లేదు. 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్లో ఆడలేదు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్న షమిని అఫ్గాన్తో జరిగే టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు. 2024 టీ20 ప్రపంచకప్లో కూడా అతడు ఆడతాడా? లేదా అనే దానిపై గందరగోళం నెలకొంది. దీంతో టీ20ల్లో తన భవితవ్యంపై షమి స్పష్టతనిచ్చాడు.
‘‘నేను వేగంగా కోలుకుంటున్నా. ఎన్సీఏలోని వైద్య నిపుణులు నా పురోగతి పట్ల సంతోషంగా ఉన్నారు. ట్రైనింగ్ సెషన్స్ని ప్రారంభించాను. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తా. టీ20ల విషయానికొస్తే.. సెలెక్టర్ల దృష్టిలో ఉన్నానో లేదో అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ, టీ20 ప్రపంచకప్నకు ముందు ఐపీఎల్ ఉంది. వరల్డ్ టీమ్ని ఎంపిక చేయడానికి ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. టీమ్ మేనేజ్మెంట్ కోరితే టీ20 ప్రపంచకప్లో ఆడతాను’’ అని షమి స్పష్టం చేశాడు.
‘ఉమ్రాన్ మాలిక్ ఎక్కడున్నాడు?’
భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) కెరీర్పై టీమ్ఇండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశాడు. కొంతకాలంగా అతడిని ఇండియా ‘ఎ’ జట్టుకి కూడా ఎంపిక చేయట్లేదన్నాడు. ‘‘కొన్నాళ్ల క్రితం ఎక్కడ చూసినా ఉమ్రాన్ మాలికే కనిపించాడు. వెస్టిండీస్ పర్యటనకు తీసుకెళ్లారు. ఒకానొక దశలో ప్రపంచకప్ జట్టులోనూ ఉంటాడని అంతా భావించారు. తర్వాత నుంచి అతడిని ఏ జట్టులోకీ తీసుకోవడం లేదు. కనీసం ఇండియా ‘ఎ’ టీమ్ కి కూడా ఎంపిక చేయలేదు. మూడు నెలల్లోనే ఏమైంది? టీమ్ఇండియాలోకి అడుగుపెట్టి కొన్ని అవకాశాలు అందుకున్నాక అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అసలెక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఎందుకిలా జరుగుతోంది?’’ అని చోప్రా ప్రశ్నించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!