Team India: కోహ్లీ రాకపై లేని స్పష్టత.. అప్పుడే ఇషాన్కు ఛాన్స్.. కఠోరంగా శ్రమించాలన్న దీపక్!
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో (IND vs ENG) టెస్టు సిరీస్ నుంచి వార్తల్లో నిలుస్తున్న విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చేందుకు ఎదురుచూపులు.. ఖాళీగా ఉన్న సమయాన్ని మానసికంగా బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలన్న దీపక్ చాహర్.. ఇలాంటి క్రికెట్ విశేషాలు..
జట్టు ప్రకటన.. అందుకే ఆలస్యమా?
ఇంగ్లాండ్తో మిగతా మూడు టెస్టులకు జట్టు ప్రకటన ఆలస్యం కావడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని పలువురు అంటున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. మిగతా మ్యాచ్లకు వస్తాడా? లేదా? అనేది తెలియడం లేదు. అతడి నుంచి వచ్చే సమాచారం కోసమే సెలక్టర్లు వేచి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ను ధ్రువీకరిస్తూ జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి నివేదికలు రావాల్సిఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం బారినపడ్డాడని.. ఇంగ్లాండ్తో సిరీస్లోని మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండటం కష్టమేనని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది.
దేశవాళీలో ఆడితేనే.. : చోప్రా
‘‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ఇషాన్ కిషన్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నాడు. అతడిని నేరుగా తీసుకోవడం సరైన పద్ధతి కాదు. దాదాపు నెలన్నర రోజులుగా క్రికెట్ ఆడటం లేదు. కనీసం ఫస్ట్క్లాస్ క్రికెట్ అయినా ఆడాల్సింది. ఫామ్ పరంగా ఇబ్బందిలేదని భావిస్తున్నా.. అతడిని ఇప్పుడే జట్టులోకి తీసుకోవద్దు. కొంతకాలం దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే అవకాశం ఇవ్వాలి. అప్పటివరకు కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, జగదీశన్ .. ఇలా ఎవరినైనా కొనసాగించాలి. విరాట్ కోహ్లీ నేరుగా వస్తాడు కదా? ఇషాన్ కిషన్ విషయంలో ఎందుకు వ్యత్యాసం అని అడగొద్దు. ఎందుకంటే వీరిద్దరి మధ్య చాలా తేడా ఉంది’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
విరామ సమయాన్ని అలా వినియోగించుకోవాలి: దీపక్ చాహర్
తండ్రికి అనారోగ్యం కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న దీపక్ చాహర్ మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘కొంతకాలం పాటు విరామం తీసుకోవడం మంచిదే. ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా పుంజుకొనే ఆస్కారముంటుంది. ఇప్పుడు మా నాన్న అనారోగ్యం కారణంగా ఆటకు దూరంగా ఉన్నా. ఈ సమయాన్ని నా పేస్ మరింత పెరిగేందుకు వినియోగించుకుంటున్నా. 2018లో నేను క్రికెట్ ఆడేటప్పుడు నా బౌలింగ్ వేగం 140 కి.మీ.గా ఉండేది. ఆ తర్వాత వేగం కోల్పోయా. నిరంతరం ఆడటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇప్పుడు నేను నా పేస్ను, నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తున్నా. బ్యాటింగ్లోనూ కొన్ని షాట్లను ప్రాక్టీస్ చేశా. లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేయాల్సిన అవసరం ఉంటుంది’’ అని దీపక్ చాహర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ