Ms Dhoni: ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కాదు: మాజీ క్రికెటర్
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పూర్తి ఫిట్గా ఉన్నాడని, అతడికి ఇదే చివరి ఐపీఎల్ కాదని మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా ఐపీఎల్ (IPL)ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. ఈ మధ్యే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు బయటకు రావడంతో అవి వైరలయ్యాయి. కానీ అతడికిదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వస్తోన్న నేపథ్యంలో మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)స్పందించాడు.
‘‘నేను ధోనిని కొన్నిరోజుల కిందట కలిశాను. పొడవాటి జుట్టు పెంచుతూ కెరీర్ తొలినాళ్లలతో ఉన్న ధోనిలా తయారవుతున్నాడు. 40 ఏళ్లు దాటినా పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. ఫ్రాంఛైజీ కోసం, అభిమానుల కోసం ఇంకొన్ని సీజన్లు ఆడేలా అతడు కనిపిస్తున్నాడు.’’అని అన్నాడు.
మూడు ఐసీసీ ట్రోఫీలు (టీ20, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫి) గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్ ఎంఎస్ ధోని. 2023లో చెన్నై సూపర్ కింగ్స్కు ఐదో టైటిల్ అందించాడు. 2024 ఐపీఎల్లో ఆరోసారి కప్పును అందుకుని రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అత్యధికంగా (ఐదుసార్లు) కప్పు గెలిచిన కెప్టెన్లుగా రోహిత్శర్మ, ధోని ఉన్నారు. ఎంతో అనుభవమున్న ధోని నాయకత్వం గురించి మాట్లాడుతూ ‘‘మనం కేవలం మాటలు చెబితే సరిపోదు. ఏదైనా చేతల్లోనే చూపించాలి. కుర్చీ లేదా ర్యాంకు వల్ల గౌరవం వస్తుందని నేను భావించను. మనం ఎలా వ్యవహరిస్తామన్న దాన్ని బట్టే అది దక్కుతుంది. సహచరులు మనల్ని నమ్మితే మెరుగైన ప్రదర్శన దానంతట అదే వస్తుంది’’అని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.