Mayank Yadav: ఐపీఎల్ 2024 సీజన్లో ఫాస్టెస్ట్ బౌలర్కు ఏమైంది?
నయా పేస్ సంచలనంగా మారిన లఖ్నవూ బౌలర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. గుజరాత్పై కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన పేస్తో యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) ఆకట్టుకున్నాడు. నిలకడగా 150+ కి.మీ వేగంతో బంతులేస్తూ స్టార్ క్రికెటర్లనే ఆశ్చర్యపరిచాడు. తాజాగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఈ లఖ్నవూ బౌలర్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే విసిరాడు. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. దీంతో అతడికి ఏమైందనే? ప్రశ్నలు తలెత్తాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. మయాంక్ పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. అతడికి ఏమైందనే విషయం మాత్రం వెల్లడించలేదు. కొన్ని మీడియాల్లో వస్తున్న కథనాల ప్రకారం అతడు పక్కటెముకల గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్ చేసిన తర్వాతనే గాయం పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే లఖ్నవూ ఫ్రాంచైజీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్లో బెంగళూరుపై 156.7 కి.మీ వేగంతో మయాంక్ బంతిని విసిరాడు. ఈ సీజన్లో ఇదే అత్యంత వేగవంతమైన బాల్ కావడం విశేషం. పంజాబ్పైనా 155.8 కి.మీ స్పీడ్తో బంతిని వేశాడు. పేసర్ కావడంతో గాయాలపాలు కావడం సహజమే. గత రెండు సీజన్లలోనూ మయాంక్ గాయం కారణంగా రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఇటీవల రంజీ ట్రోఫీ సమయంలోనూ గాయం తిరగబెట్టడంతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మూడు మ్యాచ్లకే మళ్లీ గాయపడటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
హ్యారీ బ్రూక్ స్థానంలో లిజాద్ విలియమ్స్
ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ సీజన్కు దూరమైన సంగతి తెలిసిందే. దిల్లీకి ప్రాతినిధ్యం వహించే అతడు వ్యక్తిగత కారణాల వల్ల ఆడటం లేదని ఇప్పటికే ప్రకటించాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు లిజాద్ విలియమ్స్ను తీసుకున్నట్లు దిల్లీ ఫ్రాంచైజీ ప్రకటించింది. లిజాద్ దక్షిణాఫ్రికా తరఫున 4 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. అతడి కనీస ధర రూ.50 లక్షలకు దిల్లీ తీసుకుంది. దక్షిణాఫ్రికా టీ20 ఛాలెంజ్లో టైటాన్స్ తరఫున 9 మ్యాచ్లు ఆడాడు. ఈ ఏడాది SA20 సీజన్లో సూపర్ కింగ్స్కు ఆడిన లిజాద్ తొమ్మిది మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దిల్లీ ఐదు మ్యాచుల్లో నాలుగు ఓటములు, ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రిషభ్ పంత్ కోలుకొనేందుకు చాలా కష్టపడ్డాడు. మ్యాచ్ ఆడే ఫిట్నెస్ను సాధించి బరిలోకి దిగాడు. -
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను సారథిగా నియమించింది. -
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
ఐపీఎల్లో ఇవాళ పంజాబ్తో సొంతమైదానం చెపాక్ వేదికగా చెన్నై తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ విజయమూ కీలకమే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
తమ ఓటమికి ప్రధాన కారణం టాప్ ఆర్డర్లో త్వరగా వికెట్లను కోల్పోవడమేనని ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. -
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్