Team India: దిగ్గజాల వారసత్వాన్ని కొత్తవారు కొనసాగించడం కష్టమే: పద్మశ్రీ గురుచరణ్ సింగ్
ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడమే కోచ్ల ప్రధాన బాధ్యత. దిగ్గజ క్రికెటర్లుగా మారడంలో వారిదే కీలక పాత్ర. ఇలాంటి ఎందరినో తీర్చిదిద్దిన అనుభవం గురుచరణ్ సింగ్ (Gurucharan Singh)ది. ఇప్పుడు ఆయనకు పద్మశ్రీ అవార్డును (Padma Shri) కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఎందరో క్రికెటర్లను తయారు చేసిన అనుభవం కోచ్ గురుచరణ్ సింగ్ సొంతం. అందుకే 87 ఏళ్ల వయస్సులో కేంద్ర ప్రభుత్వం గురుచరణ్ సింగ్కు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో సీనియర్ కోచ్ పలు విషయాలపై స్పందించారు. చాలా మంది కోచ్లు తమ అకాడమీలలో శిక్షణ పొందిన కారణంగానే అథ్లెట్లు విజయం సాధించారనే క్రెడిట్ని తీసుకొంటారని.. ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), సచిన్ తెందూల్కర్ (Sachin), విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వీరంతా ఒక్కో తరానికి అద్భుత ఆటగాళ్లని తెలిపాడు.
‘‘క్రికెట్ కోచింగ్లో.. ప్రతి కోచ్ తమ ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలి. అథ్లెట్లు కేవలం శిక్షణ, ప్రాక్టీస్ సెషన్లకు హాజరవుతుంటే.. వారేదో తమ ప్రోడక్ట్గా బయట ప్రచారం చేసుకోవడం సరైంది కాదు. దానికి ఉదాహరణ.. కపిల్ దేవ్ను తీసుకొందాం. ముంబయిలో నేను నిర్వహించిన క్యాంప్ల్లో శిక్షణ కోసం కపిల్ కూడా వచ్చాడు. అలా అని అతడు నేను తయారు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ చెప్పను. ఎందుకంటే కపిల్ చండీగఢ్ నుంచి వచ్చాడు. అతడిని డీపీ అజాద్ తీర్చిదిద్దారు. బ్యాట్, బాల్ ఒకేలా ఉన్నప్పటికీ.. ప్రతి కోచ్ వద్ద తమకంటూ ప్రత్యేకమైన కోచింగ్ టెక్నిక్లు ఉంటాయి. అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ తెందూల్కర్, గావస్కర్.. ఇలాంటి వారిని మళ్లీ తయారు చేయలేం. వారు క్రికెట్ దిగ్గజాలుగా మారారు. కొత్తవారు వస్తున్నప్పటికీ.. వీరి వారసత్వాన్ని కొనసాగించడం సులువైన విషయం కాదు. ఈ వయసులో నేను పద్మశ్రీ అవార్డు వస్తుందని మాత్రం ఊహించలేదు. అవార్డును ప్రకటించిన, పరిగణనలోకి తీసుకొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని వెల్లడించారు.
కోచ్గా మారకముందు గురుచరణ్ 37 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడారు. క్రికెట్ ఆడటం మానేసిన తర్వాత కోచ్గా మారారు. మాజీ ఆటగాళ్లు కీర్తి అజాద్, అజయ్ జడేజా, మనిందర్సింగ్.. ఇలా చాలామందిని అద్భుత క్రికెటర్లుగా తీర్చిదిద్దడంలో గురుచరణ్ కీలక పాత్ర పోషించారు. భారత్లో అత్యంత విజయవంతమైన కోచ్ల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. డీపీ అజాద్ (దేశ్ ప్రేమ్ అజాద్) తర్వాత పద్మ అవార్డును అందుకొన్న రెండో క్రికెట్ కోచ్ కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్