Pat Cummins: కమిన్స్కు కలిసొచ్చిన 2023.. ఆ అవార్డును సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) 2023లో కెప్టెన్గా, ఆటగాడిగా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. డిసెంబరులో పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్ను 3-0 తో క్లీన్స్వీప్ చేయడంలోనూ కీలకపాత్ర పోషించాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఏడో ఆస్ట్రేలియా బౌలర్గా రికార్డు సృష్టించాడు. దీంతో 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు విజేతగా నిలిచాడు. తైజుల్ ఇస్లాం (బంగ్లాదేశ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)ను వెనక్కినెట్టి కెరీర్లో తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. కమిన్స్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులోనూ ఉన్నాడు.
పట్టిందల్లా బంగారమే!
కమిన్స్ జీవితంలో 2023 చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది అతడు కెప్టెన్గా, ఆటగాడిగా ఎన్నో ఘనతలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో యాషెస్ సిరీస్లో ఆసీస్ మొదటి మూడు మ్యాచ్ల్లో రెండింట్లో ఓడి ఒక మ్యాచ్ డ్రా చేసుకుని బాగా వెనకబడిపోయింది. తర్వాత అనూహ్యంగా పుంజుకుని మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను డ్రా చేసుకుంది. అనంతరం ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) విజేతగా నిలిచింది. ఫైనల్లో టీమ్ఇండియాను ఓడించి తొలిసారి డబ్ల్యూటీసీ గదను అందుకుంది. ప్రపంచకప్లో రెండు ఓటములతో వెనకబడినట్లు కనిపించిన జట్టును వరుసగా ఏడు విజయాలతో ఫైనల్కు చేర్చాడు. కీలకమైన ఫైనల్లో వరుసగా 10 విజయాలు సాధించి జోరు మీదున్న టీమ్ఇండియాను తన మాస్టర్ మైండ్తో బోల్తా కొట్టించి ఆసీస్కు ఆరో ప్రపంచ కప్ టైటిల్ను అందించాడు.
ఐపీఎల్లో జాక్పాట్
ప్రపంచకప్లో సత్తా చాటిన కమిన్స్ ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలుకుతాడని ముందే ఊహించారు. అంచనాలకు తగ్గట్టుగానే ఫ్రాంఛైజీలు అతడిపై రూ. కోట్లు కుమ్మరించడానికి పోటీపడ్డాయి. చివరకు సన్రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు సొంతం చేసుకుంది. కమిన్స్ ఐపీఎల్లో ఇప్పటివరకు 42 మ్యాచ్లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
పొట్టి ప్రపంచకప్లో ఆడే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-17 సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు అందుబాటులో ఉండరు. ఈమేరకు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. -
T20 World Cup 2024: న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా పేర్లు
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ భవనంపై టీమ్ఇండియా సభ్యుల పేర్లను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్, సౌతాఫ్రికా తమ జట్లను ప్రకటించాయి. -
టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. -
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని కెప్టెన్గా ఎదిగిన రోహిత్ శర్మ (Rohit Sharma) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్కు ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. -
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
లఖ్నవూకు శుభవార్త. గాయం కారణంగా పలు మ్యాచ్లకు దూరమైన మయాంక్ యాదవ్ (mayank yadav) ఫిట్నెస్ సాధించాడు. -
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయం జెఫ్ బెజోస్ నుంచే నేర్చుకున్నా
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత