Cricket News: ఆ ముగ్గురి గురించి ఈ ఒక్క ఫొటో చాలు.. తొలి టెస్టులో జడ్డూ ఎందుకు ఆడలేదంటే?
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే టాప్ స్పిన్ ఆల్రౌండర్ల జాబితాలో ముగ్గురు భారత క్రికెటర్లు.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో జడేజా లేకపోవడానికి కారణమేంటో చెప్పిన రోహిత్.. ఐసీసీ - కోకాకోలా బంధం మరో ఎనిమిదేళ్లు.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
ఆసీస్ డ్రెస్సింగ్లో రూమ్లోనూ వారిపై చర్చ
ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్చల్ చేస్తోంది. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ డిస్ప్లే బోర్డుపై పదిమంది గురించి వివరించి చెబుతున్నాడు. ఆ ఫొటోనే నెట్టింట వైరల్గా మారింది. ఆ జాబితాలో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అత్యుత్తమ స్పిన్ ఆల్రౌండర్లు ఎవరనేదానిపై అక్కడ చర్చ జరిగింది. అందులో మూడో పేరు రవీంద్ర జడేజా, ఐదో ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్, తొమ్మిదో స్థానంలో అక్షర్ పటేల్ ఉన్నాడు. దీంతో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్ల పేర్లను ఆసీస్ ప్లేయర్లు మరవలేకపోతున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో జడ్డూ ఆడకపోవడానికి..
బాక్సింగ్ డే టెస్టులో దక్షిణాఫ్రికాతో టాప్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో అతడికి ఏమైందోననే అనుమానం అభిమానుల్లో నెలకొంది. ఒక్క స్పిన్నర్గా అశ్విన్కు అవకాశం కల్పించిన టీమ్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. అయితే, జడేజా ఆడకపోవడానికి గల కారణాలను కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ వెల్లడించింది. ‘‘ వెన్ను నొప్పిగా ఉందని రవీంద్ర జడేజా మా దృష్టికి తీసుకొచ్చాడు. అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. తొలి టెస్టులో అతడు ఆడటం లేదు’’ అని బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ కూడా టాస్ అనంతరం ఇదే విషయాన్ని తెలిపాడు.
2031 వరకు ఐసీసీ పార్ట్నర్గా కోకా కోలా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), కోకా కోలా సంస్థ మరో 8 ఏళ్లపాటు తమ భాగస్వామ్యం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఐసీసీ మహిళల, పురుషుల క్రికెట్ ఫార్మాట్లకు సంబంధించి అన్నింట్లోనూ ఐసీసీ పార్టనర్షిప్ ఉంటుంది. వన్డే, టీ20 వరల్డ్ కప్లు, ఛాంపియన్స్ ట్రోఫీలు, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ వంటి ఈవెంట్లలో ఐసీసీ భాగస్వామిగా కోకా కోలా వ్యవహరించనుంది. ఒకే ఒక్క బ్రాండ్తో ఇన్నేళ్లు ఐసీసీ పార్టనర్షిప్ కొనసాగించడం కూడా ఘనతే. ఈ మేరకు ఐసీసీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా ఓ ప్రకటన వెలువరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా