ODI WC 2023: మన పిచ్లు సూపర్.. ప్రపంచకప్లో సమతూకపు వికెట్లపై ప్రశంసలు
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) తుది దశకు చేరుకుంది. ఇప్పటికే తొలి సెమీస్ ముగిసింది. టీమ్ఇండియా విజయం సాధించి ఫైనల్కు చేరింది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పిచ్లు అద్భుతంగా రూపొందించారని మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారత్ వేదికగా ప్రపంచకప్ (ODI World Cup 2023) అనగానే.. పిచ్లన్నీ స్పిన్నర్లకు దాసోహం అంటాయని.. వాళ్లదే ఆధిపత్యం అని.. టీమ్ ఇండియా తనకు అనుకూలంగా వికెట్లు తయారు చేయించుకుని ప్రత్యర్థులను దెబ్బ కొడుతుందని అంచనా వేశారు. కానీ, ఆశ్చర్యంగా ఈ ప్రపంచకప్లో స్పిన్నర్ల కంటే పేసర్లే ఆధిపత్యం చలాయిస్తూ వచ్చారు. స్పిన్నర్ల ప్రభావం లేదని కాదు కానీ.. పేసర్లు భారత్లో ఇంత ప్రభావం చూపడమే ఆశ్చర్యం. మరోవైపు టోర్నీలో భారీ స్కోర్లూ నమోదయ్యాయి. అలా అని పిచ్లు ఏకపక్షంగా బ్యాటర్లకు అనుకూలించలేదు. బౌలర్లకూ బాగా సహకరించాయి. బ్యాటుకు, బంతికి మధ్య ఆసక్తికర పోరు సాగుతుండటంతో ప్రపంచకప్ కోసం సమతూకపు పిచ్లను తయారు చేశారనే ప్రశంసలు దక్కుతున్నాయి.
‘‘ఈ ప్రపంచకప్లో బ్యాటర్లు చెలరేగారు. బౌలర్లూ విజృంభించారు. పేసర్లు ప్రభావం చూపారు. స్పిన్నర్లూ ఆకట్టుకున్నారు. ఎవరికి ఏం కావాలో అవి ఇచ్చాయి వికెట్లు. అత్యంత సమతూకంతో ఉన్న పిచ్లను ఈ ప్రపంచకప్లో చూశాం’’.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, వ్యాఖ్యాత నాసిర్ హుస్సేన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. భారత పిచ్లు అంటే జీవం ఉండదని.. బ్యాటర్లదే ఆధిపత్యం అని.. బౌలింగ్లో స్పిన్నర్లకు తప్ప పేసర్లకు అవకాశం ఉండదని.. ఇలాంటి అభిప్రాయాలుండేవి ఒకప్పుడు. అయితే, గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. మన పేస్ బలం కూడా పెరగడం, విదేశీ పరిస్థితుల్లో సీమ్ అనుకూలించే పరిస్థితుల్లో మన బౌలర్లు రాణించాలంటే దేశీయ పిచ్లు కూడా వారికి సహకరించాల్సిన అవసరాన్ని గుర్తించి అందుకు తగ్గ వికెట్లు సిద్ధం చేస్తున్నారు.
టెస్టుల్లో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువే అయినా.. పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్లకు మాత్రం సమతూకం ఉన్న పిచ్లనే తయారు చేస్తున్నారు. ఇక ప్రపంచకప్లో పిచ్ల బాధ్యత మొత్తం ఐసీసీనే చూసుకుంటుందన్న సంగతి తెలిసిందే. కాకపోతే ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఏకపక్షంగా పిచ్లు ఉండకపోయినా.. కొంతమేర ఆ జట్ల బలానికి తగ్గట్లు వికెట్లు ఉండేలా సిద్ధం చేస్తుంటారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ బలం ఎలాంటిదో తెలిసిందే కాబట్టి ఐసీసీ క్యురేటర్లను భారత్ ప్రభావితం చేస్తుందని.. పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అంచనా వేశారు. కానీ టోర్నీలో ఏ వేదికలోనూ పిచ్లు అలా ఏకపక్షంగా స్పిన్నర్లకు అనుకూలించేలా లేవు. ఇంకా చెప్పాలంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపారు. పరిస్థితులు, పిచ్లను మిగతా జట్ల పేసర్ల కంటే మన వాళ్లే ఎక్కువ ఉపయోగించుకోవడం విశేషం.
అదే స్పెషాలిటీ
ఈసారి ప్రపంచకప్లో పిచ్లు ఎంత సమతూకంతో ఉన్నాయో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ముంబయిలో శ్రీలంకతో మ్యాచ్లో మొదట భారత్ 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. కానీ అదే పిచ్ మీద తర్వాత మన పేసర్లు ఎలా విజృంభించారో తెలిసిందే. శ్రీలంక కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ జరుగుతోంది వాంఖడేలోనా లేక ఏ గబ్బాలోనా అని ఆశ్చర్యపోయారు అందరూ. పిచ్ పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలం అయితే రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు కూడా పెద్ద స్కోర్ చేసి ఉండాలి. అలా జరగలేదు. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికా 8 వికెట్లకు ఏకంగా 399 పరుగులు చేసింది. కానీ తర్వాత ఇంగ్లాండ్ 170కే కుప్పకూలింది.
టోర్నీలో ఏ వేదికలోనూ ఏకపక్షంగా బ్యాటర్లకు పిచ్లు సహకరించలేదు. అన్ని చోట్లా భారీ స్కోర్లు నమోదయ్యాయి. అదే సమయంలో తక్కువ స్కోర్లకూ జట్లు ఆలౌట్ అయ్యాయి. టోర్నీలో మూడుసార్లు జట్లు 400కు పైగా స్కోర్లు సాధిస్తే.. మూడుసార్లు వంద లోపు స్కోర్లకు జట్లు ఆలౌట్ కావడం ఈ టోర్నీ విశిష్టతకు నిదర్శనం. అలా అని బ్యాటింగ్ మరీ కష్టంగా, పూర్తిగా బౌలర్లకు అనుకూలించేలా కూడా వికెట్లు లేవు. బ్యాటుకు, బంతికి మధ్య ఆసక్తికర పోరు జరిగేలా పిచ్లు సమతూకంగా ఉన్నాయి. టోర్నీలో స్పిన్నర్ల కన్నా పేసర్లు ఎక్కువ వికెట్లు పడగొట్టడం చూశాక.. ఉపఖండం అంటే స్పిన్నర్లదే ఆధిపత్యం అనే అభిప్రాయాన్ని ఇప్పుడు మార్చుకోవాల్సిందే. అందుకే పిచ్ల నాణ్యత, సమతూకం పరంగా ఇది ఉత్తమ ప్రపంచకప్ల్లో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు