మయాంక్‌ 99 నాటౌట్‌.. దిల్లీ లక్ష్యం 167

దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(99 నాటౌట్; 58 బంతుల్లో 8x4, 3x6) ఒక్కడే రాణించాడు...

Updated : 02 May 2021 21:35 IST

రబాడ మూడు వికెట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(99 నాటౌట్; 58 బంతుల్లో 8x4, 4x6) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్‌ మలన్‌(26; 26 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్‌ ప్రభ్‌ సిమ్రన్‌(12), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌(13)తో సహా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ దీపక్‌ హుడా(1), షారుఖ్‌ఖాన్‌(4), క్రిస్‌ జోర్డాన్‌(2) పూర్తిగా విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి వీరిని కట్టడి చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ విశ్రాంతి తీసుకోవడంతో మయాంక్‌ పగ్గాలు అందుకున్నాడు. దిల్లీ బౌలర్లలో రబాడ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని