CWG 2022 : ఫైనల్‌లోకి అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీ సింధు

కామన్వెల్త్‌ చివరి దశకు చేరుకుంటున్న వేళ భారత క్రీడాకారులు అదరగొట్టేస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో...

Published : 07 Aug 2022 16:12 IST

ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్‌ చివరి దశకు చేరుకుంటున్న వేళ భారత క్రీడాకారులు అదరగొట్టేస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం, ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లి మరో మెడల్‌ను ఖాయం చేసుకుంది. సెమీస్‌లో సింగ్‌పూర్‌కు చెందిన యో జియా మిన్‌పై 21-19, 21-17 తేడాతో సింధు అద్భుత విజయ సాధించింది. 

ఆరంభం నుంచే సింధు, మిన్‌ ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. పాయింట్ల కోసం హోరాహోరీ పోరు తప్పలేదు. అయితే కీలకమైన సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పీవీ సింధు తొలి సెట్‌ను రెండు పాయింట్ల తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్‌లోనూ ఆధిక్యం మారుతూ వచ్చింది. అయితే 11-9 ఛేంజ్‌ఓవర్‌ తర్వాత మిన్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గేమ్‌పాయింట్‌ను సాధించి పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని