Rahane: రహానె స్పెషల్ కేటగిరీ ఆటగాడు: వసీమ్ జాఫర్
డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final) ఆసీస్ చేతిలో భారత్ పరాజయంపాలైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహానె ఆట మాత్రం అభిమానులకు గుర్తుండిపోతుంది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ విలువైన పరుగులు సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) మ్యాచ్లో అత్యంత సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన టీమ్ఇండియా ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది అజింక్య రహానె. తొలి ఇన్నింగ్స్లో 89, రెండో ఇన్నింగ్స్లో 46 పరుగులు చేశాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున దూకుడైన ఆటతీరును ప్రదర్శించి వచ్చిన రహానె.. టెస్టు ఫార్మాట్లోకి అలవోకగా పరకాయ ప్రవేశం చేసేశాడు. ఓ పక్క టాప్ ఆర్డర్ అంతా త్వరగా పెవిలియన్కు చేరితే రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్తో కలిసి కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ క్రమంలో రహానెపై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన రహానె జట్టుకు వెన్నెముకగా నిలిచాడని పేర్కొన్నాడు. ఇకనుంచి రహానె నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తాడనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు.
‘‘రెండు ఇన్నింగ్స్ల్లోనూ రహానె ఆడిన తీరు అద్భుతం. ఒత్తిడిని అధిగమించి పరుగులు చేయడం బాగుంది. భారీ లక్ష్య ఛేదనలోనూ ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఆడేందుకు ప్రయత్నించాడు. దూకుడుగా సానుకూలతతో క్రికెట్ ఆడుతుంటే ప్రత్యేకమైన ఆటగాడిగా కనిపిస్తున్నాడు. ఇలాగే నిలకడగా ఆడతాడని ఆశిస్తున్నా’’ అని జాఫర్ తెలిపాడు.
అన్ని విభాగాల్లో ఆసీస్దే ఆధిక్యం: కీర్తి అజాద్
‘‘ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో మనల్ని ఓడించింది. వారి బౌలింగ్, బ్యాటింగ్ సరిగ్గా ఉన్నాయి. మన బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు కచ్చితమైన లెంగ్త్తో బౌలింగ్ సంధించారు. వారు వికెట్లు తీయని సందర్భంలోనూ అదే లెంగ్త్కు కట్టుబడి ఉన్నారు. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లోనే మ్యాచ్ను చేజార్చుకుంది. ఇక మన బౌలింగ్ మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్లో కాస్త మెరుగ్గా ఉంది. ఒకవేళ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ను 325 లోపే కట్టడి చేసి ఉంటే తప్పకుండా ఫలితం మనకు అనుకూలంగా వచ్చేది. మనకు లోతైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. అనవసరంగా వికెట్లను చేజార్చుకుని ఓటమిపాలైంది’’ అని మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ అన్నాడు.
రోహిత్ సూచనకు మద్దతిస్తా: బ్రాడ్ హాగ్
‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం మూడు టెస్టులను నిర్వహించాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూచనకు మద్దతు ఇస్తున్నా. అయితే ఈసారి కేవలం ఒక్క మ్యాచ్తోనే ఫలితం వచ్చేసింది. దీనిని మనం చేయలేం. ఆసీస్ విజేతగా నిలిచింది. ఇక భవిష్యత్తులో మాత్రం మూడు టెస్టుల సిరీస్ పెడితే బాగుంటుంది. అంతేకాకుండా, ఎనిమిది జట్లను రెండు డివిజన్లుగా చేసి నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది. టాప్ -4 ఒక గ్రూప్గా.. మరో నాలుగు రెండో గ్రూప్గా చేయాలి. అసోసియేట్ దేశాలను మరొక డివిజన్గా చేసి ఆడించాలి. ఆయా డివిజన్లలో టాపర్లుగా నిలిచిన జట్లు వారి సొంత మైదానంలో మూడు టెస్టుల సిరీస్ను ఆడితే బాగుంటుంది’’ అని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు