Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్
వరల్డ్ కప్ (ODI World Cup 2023) జట్టులో మార్పులు ఏ విధంగా ఉంటాయనే ప్రశ్నలు వస్తున్నా తాను స్పందించకూడదని.. అధికారికంగా మేనేజ్మెంట్ వెల్లడిస్తుందని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ బరిలోకి దిగే ముందు ఇంగ్లాండ్తో సెప్టెంబర్ 30న భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు ఇవాళే తుది స్క్వాడ్ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఎవరు ఉంటారు? అనే విషయాలను తాను ధ్రువీకరించకూడదని, అదంతా మేనేజ్మెంట్ చూసుకుంటుందని పేర్కొన్నాడు. అశ్విన్ లేదా మరొకరినైనా ఎంపిక చేస్తే సెలెక్షన్ కమిటీ అధికారికంగా వెల్లడిస్తుందని స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో ద్రవిడ్ మాట్లాడాడు. ‘‘భారత ఆటగాళ్లంతా కీలక సమయంలో ఫామ్లోకి వచ్చారు. వారంతా ప్రతిభావంతులే. బుమ్రా, సిరాజ్, అశ్విన్, కేఎల్, శ్రేయస్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ విభాగాల్లో రాణించారు. వన్డేల్లో ఫామ్తో ఇబ్బంది పడిన సూర్యకుమార్ కూడా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇదే ఊపును వరల్డ్ కప్లోనూ కొనసాగిస్తారని భావిస్తున్నా. అన్ని రంగాల్లో ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాలి’’ అని వెల్లడించాడు.
అక్షర్ ఉంటాడా?
‘‘తుది జట్టు కోసం మేమంతా వేచి ఉన్నాం. అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జాతీయ క్రికెట్ అకాడమీతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ బృందం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. దీనిపై నేను ఎలాంటి కామెంట్లు చేయకూడదు. ఎలాంటి మార్పు ఉన్నా మేనేజ్మెంట్ అధికారికంగా వెల్లడిస్తుంది. ఇప్పటి వరకైతే ఎలాంటి మార్పులు లేవు’’ అని ద్రవిడ్ తెలిపాడు. దీంతో అక్షర్ పటేల్ 15 మందితో కూడిన స్క్వాడ్లో ఉండొచ్చనే సూచనలు ఇచ్చినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గువాహటికి పూర్తిస్థాయి జట్టు వస్తుందని, వరల్డ్ కప్ సన్నాహాలు ప్రారంభమవుతాయని ద్రవిడ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ