IND vs SL : ఆసియా కప్ ఫైనల్ సమరం.. వరుణుడి సహకారం ఎలా ఉండనుందంటే?
భారత్ - శ్రీలంక (IND vs SL) జట్ల మధ్య ఆసియా కప్ ఫైనల్కు వేదిక కొలంబోలోని ప్రేమదాస స్టేడియం. కానీ, వాతావరణ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. రిజర్వ్ డే ఉన్నప్పటికీ.. ఇవాళ పూర్తిస్థాయి మ్యాచ్ జరిగితే బాగుంటుందనేది అభిమానుల కోరిక.
ఇంటర్నెట్ డెస్క్: మినీ టోర్నీ విజేతగా నిలిచేందుకు భారత్ - శ్రీలంక (IND vs SL) జట్లు తమ శక్తియుక్తులతో సిద్ధమవుతున్నాయి. అయితే, ఆసియా కప్ (Asia Cup 2023) ఫైనల్ జరగనున్న కొలంబోలో వరుణుడి ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ సంకేతాలు ఇస్తోంది. అడపాదడపా వర్షం పడినా.. మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇవాళ పూర్తిస్థాయి మ్యాచ్ నిర్వహించేందుకు అనుకూలంగా లేకపోయినా రిజర్వ్డే ఎలానూ ఉంది. ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్-శ్రీలంక (IND vs SL) జట్లు ఫైనల్లో ఎనిమిది సార్లు తలపడగా.. టీమ్ఇండియా అత్యధికంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది. మరో మూడుసార్లు శ్రీలంక టైటిల్ ఎగరేసుకుపోయింది. మరి ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అయితే, ఈ లోగా వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందో తెలుసుకుందాం.. ప్రస్తుతం కొలంబో వాతావరణం పొడిగానే ఉంది. వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. తేమశాతం కూడా 65% మాత్రమే ఉంది.
ఒక్కో గంటకు ఇలా..
- 12 గంటలు: మేఘావృతై ఉంటుంది. కానీ, వర్షం పడేందుకు అవకాశాలు 49 శాతంగా ఉంది. గాలిలో తేమ 67 శాతంగా నమోదవుతుంది.
- మధ్యాహ్నం 1 గంటకు: ఈ సమయంలో కాస్త వర్షం పడే అవకాశాలు పెరుగుతాయి. 66 శాతంగా ఉంటాయి. కాబట్టి మెరుపులతో చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తేమశాతం 76కి పెరుగుతుంది.
- 2 గంటలు: మళ్లీ చినుకులు పడటం ఆగిపోయి వాతావరణం సాధారణ స్థితికి రావచ్చు. ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీలుగా ఉండనుంది. వర్షం పడేందుకు 49 శాతం అవకాశం ఉంది.
- 3 గంటల నుంచి 5 గంటల వరకు: టాస్ వేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్ వేస్తారు. వాతావరణం పొడిగానే ఉండొచ్చు. అక్కడక్కడా మబ్బులు ఉంటాయి. వర్షం పడే అవకాశం 49 శాతం మాత్రమే. సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- 6 గంటలు: మరోసారి వరుణుడు అడ్డొస్తాడని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో వర్షం పడే అవకాశాలు 61 శాతంగా ఉండటం గమనార్హం. తేమ శాతం 87%గా నమోదైంది. అయితే, కాసేపు మాత్రమే వాన పడొచ్చు.
- రాత్రి 7 గంటలు: సాయంత్రం 6 గంటల నుంచి వచ్చే వర్షం త్వరగా ఆగిపోతే మాత్రం మ్యాచ్ మళ్లీ పునఃప్రారంభమవుతుంది. రాత్రి 7 గంటల సమయంలో ఎలాంటి వాన జాడ ఉండకపోవచ్చు. ఆ సమయంలో వాతావరణంలో తేమశాతం 86శాతంగా ఉంటుందని అంచనావేయడంతో వర్షం పడే అవకాశం 49 శాతంగానే ఉంది.
- 8 గంటలు: మళ్లీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. వర్షం పడే అవకాశం 57 శాతంగా ఉంది. ఎక్కువగా వాన లేకపోతే మ్యాచ్ను తిరిగి ప్రారంభించడానికి పెద్దగా సమయం తీసుకోరు.
- 9 గంటలు: ఈ సమయానికి వర్షం ఉండదు. కానీ, అంతకుముందు కురిసే వాన పరిస్థితిపైనే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అప్పటికి మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం వచ్చేందుకు 49 శాతం మాత్రమే ఛాన్స్ ఉంది.
- 10 గంటలు: ఈసారి మాత్రం వర్షం పడే అవకాశం దాదాపు 66 శాతంగా ఉంది. కాస్త ఎక్కువగానే వర్షం పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మ్యాచ్ పునఃప్రారంభానికి ఇదే సమయం కీలకం. ఈ సమయంలో ఎంత తీవ్రంగా వర్షం పడుతుందో చూసి దానిని బట్టి మ్యాచ్న రిజర్వ్డేకు వాయిదా వేస్తారు.
- 11 గంటలు: వాతావరణ శాఖ నివేదికను బట్టి ఈ సమయానికి వర్షం తగ్గినా.. మ్యాచ్ నిర్వహణకు అనువైన పరిస్థితులు ఉంటాయా..? అనేది అనుమానమే. ఒక వేళ పిచ్ సిద్ధం కాకపోతే మాత్రం మ్యాచ్ను రిజర్వ్డేకు వాయిదా వేసి.. మిగతా మ్యాచ్ను సోమవారం నిర్వహిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్