Base Ball : తెలంగాణ బేస్‌బాల్ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా రామచంద్రా రెడ్డి

తెలంగాణ బేస్‌బాల్ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా ఎస్‌. రామచంద్రా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈయన 2025 వరకు మూడేళ్ల పాటు..

Published : 15 Mar 2022 15:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ బేస్‌బాల్ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా ఎస్‌.రామచంద్రా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈయన 2025 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. బేస్‌బాల్‌ కుటుంబాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఛైర్మన్‌గా ఎన్నికవడం తనకు దక్కిన గౌరవమని, తెలంగాణలో చిన్నారులను బేస్‌బాల్‌ గేమ్‌వైపు ప్రోత్సహించేందుకు ఒక వేదికను సిద్ధం చేస్తామని అన్నారు. సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.గోపికృష్ణన్‌, సెక్రటరీ ఎల్‌.రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వి.అరవింద్, ఎస్‌.వెంకటేశ్‌, ఎం. శ్రీనివాసరావు, జాయింట్‌ సెక్రటరీలు సి.వి.ప్రతాప్, డాక్టర్‌ ఆర్.హరినారాయణ రావు, ముక్తార్‌ అహ్మద్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు సయీద్‌ ఫారూక్‌ కమల్, డి.నిలేష్‌ యాదవ్‌, కోశాధికారి టి.పద్మనాభన్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు రాహుల్‌ గాడ్సే, రోహిత్‌ చందన, వీణా మాధురి, కిషోర్‌ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని