Team India: మళ్లీ రమీజ్ రజా అవాకులు.. ఈసారి భారత బౌలింగ్పై చెవాకులు!
టీమ్ఇండియా క్రికెట్ (Team India)పై ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉండే వ్యక్తి రమీజ్ రజా (Ramiz Raja). ఈసారి కూడా మరోసారి నోరు పారేసుకొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) గెలిచినా.. ఓడినా సరే పాకిస్థాన్ (Pakistan) మాజీ కెప్టెన్ రమీజ్ రజా (Ramiz Raja) విమర్శించడానికి, అవాకులు చెవాకులు పేలటానికి సిద్ధంగా ఉంటాడు. ఇటీవల న్యూజిలాండ్పై భారత్ వన్డే, టీ20 సిరీస్లను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే పాక్ బౌలింగ్తో పోలిస్తే భారత బౌలింగ్ కాస్త బలహీనంగా ఉందని రమీజ్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో పాక్ బౌలింగ్ను టీమ్ఇండియా (Team India) అనుసరిస్తోందని పేర్కొన్నాడు. ఇరు జట్ల పేస్ బౌలింగ్ మధ్య సారూప్యతను ఎత్తిచూపాడు.
‘‘పాక్ బౌలింగ్ అటాక్ను పరిశీలించి.. వారి బౌలింగ్ దాడిని కూడా రూపొందించిందని నేను ఎప్పట్నుంచో భావిస్తున్నా. హారిస్ రవూఫ్ మాదిరిగానే ఉమ్రాన్ మాలిక్.. షహీన్ షా అఫ్రిదిలా అర్ష్దీప్ సింగ్.. ఇక మిడిల్ ఓవర్లలో వసీమ్ జూనియర్ మాదిరిగా హార్దిక్ పాండ్య బౌలర్లుగా తయారు చేసుకొంది. శివమ్ మావి సపోర్టింగ్ బౌలర్గా సిద్ధం చేసింది. అయితే భారత పేస్ దళం పాక్ కంటే తక్కువే కానీ.. స్పిన్ విభాగం మాత్రం పటిష్ఠమైంది. స్పిన్ బౌలింగ్ను బలోపేతం చేసుకోవాలని ఎప్పుడూ పాక్ జట్టుకు సూచిస్తూ ఉంటా. ఇక న్యూజిలాండ్ - భారత్ జట్ల (IND vs NZ) మధ్య జరిగిన మ్యాచ్లను చూశా. భారత బౌలింగ్ సాధారణంగా అనిపించింది. కివీస్ ఆందోళనకు గురై సిరీస్ను వదిలేసుకొంది. కానీ, భారత్ను స్వదేశంలో అడ్డుకోవడం అతిపెద్ద సవాలే అవుతుంది’’ అని రమీజ్ రజా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది శ్రీలంక, కివీస్ జట్ల మీద భారత్ వరుసగా వన్డే, టీ20 సిరీస్లను సొంతం చేసుకొంది. మరోవైపు పాక్ మాత్రం స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్నూ కోల్పోయి తీవ్ర విమర్శలపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్