IND vs ENG: భారత్ను ఓడించాలంటే.. ఇంగ్లాండ్కు ‘ఔట్సోర్సింగ్’ అవసరం: రవిశాస్త్రి
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులోనూ (IND vs ENG) భారత్ భారీ ఆధిక్యమే సాధించింది. ఇప్పటికే సిరీస్ను గెలిచిన టీమ్ఇండియా... చివరి మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను ముగించాలని భావిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్పై టీమ్ఇండియా (IND vs ENG) ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సిరీస్ను కోల్పోయిన పర్యటక జట్టు.. చివరి మ్యాచ్లోనైనా గెలుద్దామంటే.. ఇప్పటికైతే ఆ పరిస్థితులు లేవు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్మన్ గిల్ సెంచరీ సాధించగా.. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, దేవదుత్ పడిక్కల్ అర్ధశతకాలు చేసి భారత్ను మెరుగైన స్థితిలో నిలిపారు. ఈక్రమంలో టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే అలాంటి బౌలింగ్ దళాన్ని ‘ఔట్సోర్సింగ్’ చేసుకోవాలని కామెంటేటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అతడితోపాటు సంజయ్ మంజ్రేకర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘‘భారత్ను ఇక్కడ ఓడించడం చాలా కష్టం. టీమ్ఇండియాకు ఉన్న బౌలింగ్ విభాగమే కావాలి. దాంతోపాటు యశస్వి జైస్వాల్, రోహిత్.. మరికొందరిని తీసుకోవాలి’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
‘‘ప్రాథమికంగా ఇంగ్లాండ్కు ‘ఔట్సోర్స్’ రిసోర్సులు కావాలన్నమాట’’ అని సంజయ్ మంజ్రేకర్ అనడంతో రవిశాస్త్రి మరోసారి స్పందించాడు.
‘‘తప్పకుండా వారికి అలాంటి అవసరం ఉందని చెబుతా. భారత్ వేదికగా సిరీస్ విజయం కోసం చాలా ఏళ్లుగా వారు ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా 2012లో ఇంగ్లాండ్ ఇక్కడ సిరీస్ను నెగ్గింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా ఆ దిశగా రాలేకపోయింది’’ అని రవిశాస్త్రి తెలిపాడు.
రోహిత్ ఏం చెప్పాడో.. నేనూ అదే చెప్పేవాడిని: సబా కరీం
భారత్ స్ట్రైక్రేట్ వెనక కారణం తామున్నామని ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అందుకే క్రెడిట్ తమ జట్టుకూ ఇవ్వాలని అప్పట్లో అన్నాడు. ఆ విషయాన్ని ఐదో టెస్టు సందర్భంగా రోహిత్ దృష్టికి ఓ విలేకరి తీసుకొచ్చాడు. దానిపై రోహిత్ మాట్లాడుతూ.. ‘మా జట్టులో ఓ ఆటగాడు ఉండేవాడు. అతడి పేరు రిషభ్ పంత్. బెన్ డకెట్ అతడి ఆటను చూసి ఉండకపోవచ్చు’’ అని సమాధానం ఇచ్చాడు. దీనిపై భారత మాజీ సెలక్టర్ సబా కరీం స్పందించాడు.
‘‘ రోహిత్ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. నేను కూడా అలానే స్పందించేవాడిని. ఇంగ్లాండ్లోని కొంతమంది ఆటగాళ్లు రిషభ్ పంత్ ఆటను చూసి ఉండకపోవచ్చు’’ అని సబా వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
-
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!