T20 World Cup: ఫైనల్ చేరేది పాకిస్థానే.! : రాబిన్ ఉతప్ప
టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకొంది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు గురువారం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ తుది దశకు చేరుకొంది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఫైనల్కు చేరుకొంది. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు గురువారం దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరుతుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్లో రెండు జట్లు బాగా ఆడుతున్నాయని.. అయితే, పాక్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి ముందుకుసాగుతోందని.. అందుకే ఆ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతోందని పేర్కొన్నాడు.
‘ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగునున్న రెండో సెమీఫైనల్లో పాక్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో ఆ ఒక్క జట్టే అజేయంగా కొనసాగుతోంది. అది పాక్కు కలిసొస్తుందో లేదో తెలియదు. కానీ, అదే జోరుని కొనసాగిస్తే మాత్రం విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మరో వైపు ఆస్ట్రేలియా కూడా మెరుగ్గా రాణిస్తోంది. వాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమదైన రోజున ఎంతటి బలమైన జట్టునైనా ఓడించగలదు. ప్రత్యేకించి ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టుకు గొప్ప రికార్డుంది. ఆసీస్ ఓపెనర్లు మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది’ అని రాబిన్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్లో రెండుసార్లు ఫైనల్స్కు చేరిన పాకిస్థాన్ జట్టు 2009తో ఛాంపియన్గా నిలిచింది. మరోవైపు, ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలువలేకపోయింది. అందుకే, ఈ సారి ఎలాగైనా కప్ను గెలవాలనే కసితో బరిలోకి దిగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?