Rohit Sharma: రోహిత్ను కోల్కతా ఓపెనర్గా చూడాలనుంది : వసీమ్ అక్రమ్
ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్ను కాదని ముంబయి హార్దిక్ను కెప్టెన్గా నియమించుకుంది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి కూడా ఆ జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు.
ఇంటర్నెట్ డెస్క్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్ భవితవ్యంపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబయి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి పాండ్యకు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రోహిత్, హార్దిక్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సీజన్లో కేవలం బ్యాటర్గానే బరిలోకి దిగుతున్న రోహిత్ శుభారంభాలను ఇస్తున్నప్పటికీ.. భారీ స్కోర్లుగా మాత్రం మలచలేకపోతున్నాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ముంబయి జట్టుకు రోహిత్ ఆడే అవకాశాలు చాలా తక్కువని వసీమ్ అక్రమ్ వ్యాఖ్యానించాడు.
‘‘నాకు తెలిసి.. రోహిత్ వచ్చే సీజన్ నుంచి ముంబయి జట్టులో భాగస్వామ్యం కాకపోవచ్చు. అతడిని కోల్కతా జట్టులో చూడాలని ఉంది. ఓపెనర్గా రోహిత్.. మెంటార్గా గౌతమ్ గంభీర్, అయ్యర్ కెప్టెన్.. ఇలా ఊహించుకుంటేనే భలేగుంది. కోల్కతా బ్యాటింగ్ లైనప్ చాలా బలమైంది. ఈడెన్ గార్డెన్స్లో రోహిత్ రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఈ పిచ్పై రోహిత్ భారీ ఇన్నింగ్స్లు ఆడేస్తాడు. గొప్ప ఆటగాడు అనడంలో సందేహం లేదు. అందుకే, కోల్కతా తరఫున రోహిత్ను చూడాలని ఉందని గట్టిగా చెబుతున్నా.
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. గౌతమ్ గంభీర్ మెంటార్గా వచ్చిన తర్వాత మెరుగైంది. మైదానంలో ఆవల కూర్చుని ఆటగాళ్లతో మాట్లాడతాడు. ఒక్కసారి గేమ్ ప్రారంభమయ్యాక మాత్రం కెప్టెన్కే అన్నీ వదిలేస్తాడు. శ్రేయస్ కూడా నాయకుడిగా జట్టును సరైన దారిలో నడపిస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ వివిధ స్థానాల్లో వస్తూ పరుగులు చేస్తున్నాడు. తమ జట్టు గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి గౌతమ్ ఉన్నాడనే భరోసా అతడికి ఉంది’’ అని వసీమ్ తెలిపాడు. ప్రస్తుతం కోల్కతా 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కనీసం ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ బెర్తు ఖరారవుతుంది. మరోవైపు ఐపీఎల్ 17వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ముంబయి నిలిచింది. హార్దిక్ నాయకత్వంలోని ముంబయి 12 మ్యాచుల్లో కేవలం 4 విజయాలను మాత్రమే నమోదు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..