SA vs IND: మ్యాచ్ను మలుపు తిప్పిన ఎంగిడి, రబాడ.. భారత్ 153 ఆలౌట్
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే కుప్పకూలగా.. టీమ్ఇండియా (Team India).. 153 పరుగులకు ఆలౌటైంది.
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో (SA vs IND) జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్.. 34.5 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే భారత్ 98 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మొదటి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 55 పరుగులకే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో నిలిచిన టీమ్ఇండియా.. చివరి సెషన్లో అనుహ్యంగా కుప్పకూలింది. భారత్ తన చివరి ఆరు వికెట్లను 11 బంతుల వ్యవధిలో 153 పరుగుల వద్దే కోల్పోవడం గమనార్హం. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పారు. ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్ప్రీత్ బుమ్రా (0)లను పెవిలియన్కు పంపాడు. రాహుల్.. వికెట్కీపర్ వెరినేకు క్యాచ్ ఇవ్వగా.. జడేజా, బుమ్రా స్లిప్లో మార్కో జాన్సెన్కు చిక్కారు. రబాడ వేసిన తర్వాతి ఓవర్లో కోహ్లీ (46; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో సిరాజ్ (0) రనౌట్ కాగా.. ప్రసిద్ధ్ కృష్ణ (0) చివరి వికెట్గా వెనుదిరిగాడు. భారత బ్యాటర్లలో కోహ్లీతోపాటు రోహిత్ శర్మ (39; 50 బంతుల్లో), శుభ్మన్ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి, నండ్రీ బర్గర్ మూడేసి వికెట్లు పడగొట్టారు.
టీ విరామం
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా స్వల్పవ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. నండ్రీ బర్గర్ వరుస ఓవర్లలో శుభ్మన్ గిల్ (36; 55 బంతుల్లో 5 ఫోర్లు), తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (0)ని ఔట్ చేశాడు. 24 ఓవర్లకు స్కోరు 111/4. కోహ్లీ (20*; 27 బంతుల్లో 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (0*; 7 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 56. ఈ క్రమంలోనే టీ విరామం ప్రకటించారు.
రోహిత్ దూకుడు
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసిన టీమ్ఇండియా (Team India).. బ్యాటింగ్లోనూ అదరగొడుతూ ఆధిక్యంలోకి వచ్చింది. రబాడ బౌలింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) ఔటైనా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (39; 50 బంతుల్లో 7 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. లుంగి ఎంగిడి వేసిన రెండో ఓవర్లో రోహిత్ మూడు ఫోర్లు బాదాడు. నండ్రీ బర్గర్ వేసిన ఆరో ఓవర్లోనూ భారత కెప్టెన్ మూడు బౌండరీలు రాబట్టాడు. దీంతో 10 ఓవర్లకే భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. అర్ధ శతకం దిశగా సాగుతున్న రోహిత్.. బర్గర్ బౌలింగ్లో మార్కో జాన్సెన్కు చిక్కాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (13*; 6 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడు ప్రదర్శిస్తున్నాడు. శుభ్మన్ గిల్ (24*; 36 బంతుల్లో 4 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నాడు. 16 ఓవర్లకు స్కోరు 90/2. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 35.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా