sachin dhoni: టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన క్రికెట్‌ లెజెండ్స్‌.. ఎందుకంటే?

క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన చేతిలో టెన్నిస్‌ రాకెట్లు.. జెర్సీకి బదులు క్యాజువల్‌ టీషర్టులతో కనిపించి టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సందడి చేశారు.

Published : 07 Oct 2022 01:29 IST

దిల్లీ: క్రికెట్‌ బ్యాట్‌ పట్టిన చేతిలో టెన్నిస్‌ రాకెట్లు.. జెర్సీకి బదులు క్యాజువల్‌ టీషర్టులతో కనిపించి టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సందడి చేశారు. గురువారం ఓ అడ్వర్టయిజ్‌మెంట్‌ షూటింగ్‌లో లెజెండరీ ఆటగాళ్లు సచిన్‌ తెందూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ పాల్గొన్నారు. ఈ అరుదైన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు సచిన్‌ వీరాభిమాని అనే విషయం తెలిసిందే.  గతంలో లండన్‌ వేదికగా జరిగిన వింబుల్డన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు కుటుంబంతో కలిసి వెళ్లాడు. ఇటీవల కపిల్‌ దేవ్‌తో కలిసి యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో కనిపించిన ధోనీ.. ఈ క్రీడ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని