శిఖర్ ధావన్ నాయకత్వంలో నడిచాం : స్టోయినిస్
తను సారథి కాకపోయినప్పటికీ దిల్లీ జట్టు ఈ ఏడాది శిఖర్ ధావన్ నాయకత్వంలో నడిచిందని ఆ జట్టు ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ అన్నాడు. తన ఆటతీరుతో శిఖర్ జట్టును ప్రభావితం చేశాడని ధావన్ను ప్రశంసించాడు. ఈ సీజన్లో జట్టు కోసం చాలా సార్లు శిఖర్ గొప్ప ఇన్నింగ్స్
అబుదాబి: దిల్లీ జట్టు ఈ ఏడాది శిఖర్ ధావన్ నాయకత్వంలో నడిచిందని ఆ జట్టు ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ అన్నాడు. అతని ఆటతీరుతో శిఖర్ జట్టును ప్రభావితం చేశాడని ధావన్ను ప్రశంసించాడు. ఈ సీజన్లో జట్టు కోసం పలుమార్లు శిఖర్ గొప్ప ఇన్నింగ్స్ ఆడినట్లు స్టోయినిస్ తెలిపాడు. భిన్న పరిస్థితుల్లో గొప్పగా ఎలా రాణించాలో ధావన్ నుంచి నేర్చుకుంటున్నట్లు హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ అనంతరం స్టొయినిస్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా స్టొయినిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టుకు శ్రేయేస్ అయ్యర్ కెప్టెన్ అయినప్పటికీ ధావన్ ఆటగాళ్లను ముందుండి నడిపించాడని పేర్కొన్నాడు.
లీగ్ ఆరంభంలో విజయాలతో దూకుడుగా ఆడిన దిల్లీ చివర్లో వరుస ఓటములతో ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్తో ధావన్ జట్టులో జోష్ నింపాడని స్టొయినిస్ అన్నాడు. లీగ్లో ఇప్పటి వరకూ రెండు శతకాలు బాదిన ధావన్ 603 పరుగులు చేశాడు. ఆదివారం జరిగిన కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచులోనూ శిఖర్ 78 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు. ఇప్పటికే ఆరువందలకు పైగా పరుగులు చేసిన ధావన్కు ఫైనల్లో భారీ స్కోరు చేసే పని మిగిలి ఉందని స్టొయినిస్ అభిప్రాయపడ్డాడు.
ధావన్తో పాటు దిల్లీ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేస్తున్న స్టొయినిస్ లీగ్లో 352 పరుగులు చేసి 12 వికెట్లు తీశాడు. ఆదివారం హైదరాబాద్తో జరిగిన మ్యాచులో ఓపెనర్గా వచ్చిన ఈ ఆల్రౌండర్ 38 పరుగులు చేశాడు. బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసి మూడు కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ చేజారుతుందనే సమయంలో ఫామ్లో ఉన్న మనీశ్పాండేతో పాటు విలియమ్సన్ను ఔట్ చేసి దిల్లీ విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇదిలా ఉంటే టైటిల్ పోరులో తొలిసారి ఫైనల్కు చేరిన దిల్లీ మంగళవారం డిఫెడింగ్ ఛాంపియన్ ముంబయితో ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. కూలిన ప్రాంతం గుర్తింపు!
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు