ICC Rankings: అగ్రస్థానానికి చేరువలో శుభ్మన్ గిల్, సిరాజ్.. మూడు స్థానాలు ఎగబాకిన కోహ్లీ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్ ఆయా విభాగాల్లో అగ్రస్థానానికి చేరువయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ విజయాల్లో టాప్ ఆర్డర్ కీలక పాత్ర పోషిస్తోంది. రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. బంగ్లాదేశ్పై అర్ధ శతకం బాది శుభ్మన్ గిల్ (Shubman Gill) లయ అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లో కొనసాగుతున్నారు. గిల్ అగ్రస్థానానికి అతి చేరువలో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచకప్లో ఐదు ఇన్నింగ్స్ల్లో 157 పరుగులే చేశాడు. దీంతో అతడి రేటింగ్ పాయింట్లు 829కి పడిపోయాయి. గిల్ 823 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అంటే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఆరు పాయింట్లే.
ఈ ప్రపంచకప్లో వరుసగా సెంచరీలతో అలరిస్తున్న సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఏడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్పై సెంచరీ మిస్ (95) చేసుకున్న విరాట్ కోహ్లీ మూడు స్థానాలు మెరుగై డేవిడ్ వార్నర్తో కలిసి ఐదో స్థానాన్ని పంచుకుంటున్నాడు. రోహిత్ శర్మ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ (670 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ప్రపంచకప్లో ఇప్పటివరకు ఆరు వికెట్లు పడగొట్టిన టీమ్ఇండియా ఫాస్ట్బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఒక స్థానం మెరుగై రెండో స్థానంలో నిలిచాడు. టాప్లో ఉన్న హేజిల్వుడ్, సిరాజ్ మధ్య రెండు పాయింట్ల వ్యత్యాసమే ఉంది. కుల్దీప్ యాదవ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఆల్రౌండర్ల విభాగంలో భారత్ నుంచి హార్దిక్ పాండ్య ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అతడు 19 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (324 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..