BCCI: శుభ్మన్ గిల్, రవిశాస్త్రిలకు ప్రతిష్ఠాత్మక అవార్డు
బీసీసీఐ (BCCI) అందించే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును శుభ్మన్ గిల్, లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డును రవిశాస్త్రి అందుకోనున్నారు.
దిల్లీ: టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నాడు. బీసీసీఐ (BCCI) అందించే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు గిల్కు దక్కనుంది. ఈ విషయాన్ని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మంగళవారం (జనవరి 23న) హైదరాబాద్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. తొలి టెస్టు కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముంది. ఏడాది కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాడికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తారు. కరోనా కారణంగా కొన్నాళ్లుగా ఈ అవార్డుల ప్రదానాన్ని బీసీసీఐ నిలిపివేసింది. చివరిగా 2020లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
2023లో శుభ్మన్ అద్భుతంగా ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 52 ఇన్నింగ్స్ల్లో 2,154 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే గతేడాది అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 29 వన్డేల్లో 63.36 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, ఐదు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టులు, టీ20ల్లో ఒక్కో శతకం బాదాడు.
Ravi Shastri: రవిశాస్త్రికి లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు
భారత మాజీ ఆల్రౌండర్, కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోనున్నాడు. భారత క్రికెట్కు అతడు అందించిన సేవలకుగాను గుర్తుగా ఈ అవార్డును అందిస్తున్నారు. 1981 నుంచి 1992 మధ్య 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన శాస్త్రి కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. రిటైర్మెంట్ అనంతరం వ్యాఖ్యాతగా మారిన ఆయన 2014 నుంచి 2016 వరకు ఇండియా క్రికెట్ జట్టుకు డైరెక్టర్గా ఉన్నారు.
ప్రధాన కోచ్గా భారత క్రికెట్లో అనేక మార్పులు
అనిల్ కుంబ్లే తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ పదవి చేపట్టిన శాస్త్రి... కెప్టెన్ విరాట్ కోహ్లీ సహకారంతో భారత క్రికెట్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఫాస్ట్ బౌలర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రోత్సహించారు. ఈయన కోచ్గా ఉన్న కాలంలో ఇండియా 2019 వన్డే వరల్డ్కప్లో సెమీఫైనల్కు వెళ్లింది. 2018-19, 2020-21 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్లు గెలిచి చరిత్ర సృష్టించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (2019-2021)లో ఫైనల్కు చేరి న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. టెస్టు క్రికెట్లో నెం1 ర్యాంకులో కొనసాగినా ఐసీసీ ట్రోఫీ మాత్రం సాధించలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!