IND vs ENG: మన కుర్రాళ్లు కన్ఫ్యూజ్ చేశారు.. బెయిర్స్టో బెంబేలు పడ్డాడు!
ప్రత్యర్థి బ్యాటర్పై ఒత్తిడి తీసుకొచ్చి.. ఔటయ్యేలా చేయడంలో భారత కుర్రాళ్లూ తక్కువేం కాదని నిరూపించుకొన్నారు. తాజాగా బెయిర్స్టో ఔటైన తీరే ఇందుకు నిదర్శనం..
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న (IND vs ENG) ఐదో టెస్టులో భారత్ పట్టు సాధించింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన పర్యటక జట్టును టీమ్ఇండియా బౌలర్లు బెంబేలెత్తించారు. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తొలుత స్లెడ్జింగ్ ప్రారంభిస్తే.. టీమ్ఇండియా యువ క్రికెటర్లూ తామేం తక్కువ కాదని దీటుగా బదులిచ్చారు. కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న జానీ బెయిర్స్టోను లక్ష్యంగా చేసుకోవడం విశేషం. అతడిని ఉడికించి ఏకాగ్రతను కోల్పోయేలా చేశారు. అయితే, ఇదంతా రెండో రోజు శుభ్మన్ గిల్ - జేమ్స్ అండర్సన్ మధ్య ప్రారంభం కాగా.. దానిని కొనసాగిస్తూ ధ్రువ్ జురెల్, గిల్, సర్ఫరాజ్ ఖాన్ స్పందించడం గమనార్హం. వీరి దెబ్బకు తర్వాత బంతికే బెయిర్ స్టో వికెట్ ఇచ్చేశాడు. వీరి మధ్య మాటల యుద్ధం జరిగిందిలా..
బెయిర్స్టో: అలసిపోవడం గురించి జిమ్మీతో నువ్వేం అన్నావు? ఆ తర్వాతే నిన్ను ఔట్ చేశాడు కదా?
గిల్: ఏదైతేనేమీ అదంతా 100 తర్వాతే జరిగింది. నువ్వు ఎన్ని చేశావు?
బెయిర్స్టో: నువ్వు ఏం సాధించావు? ఇక్కడితో ఆపు.
ధ్రువ్: నువ్వు మ్యాచ్ చూడలేదా? గిల్ ఎలా ఆడాడో..?
గిల్: ప్రతి ఒక్క భారత బౌలర్ మిమ్మల్ని ఔట్ చేస్తారు. కుల్దీప్ యాదవ్ నీకంటే బాగా బ్యాటింగ్ చేశాడు. నేను కూడా నీ వికెట్ తీయగలను.
సర్ఫరాజ్: (బెయిర్స్టోను ఉద్దేశించి) ఇవాళ కొన్ని పరుగులు చేశాడు. దానికే ఎగిరెగిరి పడుతున్నాడు.
ఇదంతా జరిగిన తర్వాత బంతికే బెయిర్ స్టోను కుల్దీప్ ఎల్బీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో బెయిర్ స్టో 39 పరుగులు చేశాడు. అంపైర్ ఎల్బీగా ప్రకటించినప్పటికీ.. ఇంగ్లాండ్ డీఆర్ఎస్ తీసుకుంది. బంతి వికెట్లను తాకిపైకి వెళ్తున్నట్లు అనిపించింది. అప్పటికే ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. సమీక్షలో ‘అంపైర్స్ కాల్’ రావడంతో బెయిర్స్టో నిరాశగా పెవిలియన్కు చేరాడు. ఇదే సమయంలో గిల్ను ఇంగ్లాండ్ బ్యాటర్ ఏవో మాటలు అంటూ వెళ్లడం వీడియోల్లోనూ కనిపించింది. ఇప్పుడివి నెట్టింట వైరల్గా మారాయి.
అండర్సన్ ఏమన్నాడో చెప్పని గిల్..
రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అండర్సన్తో జరిగిన వాగ్వాదాన్ని గిల్ తేలిగ్గా కొట్టిపడేశాడు. మైదానంలో ఏం అనుకున్నామనే విషయాలను చెప్పలేనని వ్యాఖ్యానించాడు. అదంతా ప్రైవేట్ వ్యవహారమని.. బయటకు చెప్పడం బాగోదని తెలిపాడు. కేవలం తన బ్యాటింగ్పైనే శ్రద్ధ పెట్టినట్లు పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!