సౌరవ్ గంగూలీ ప్రేమలోనూ దాదానే!
ఈరోజు మాజీ టీమ్ ఇండియా కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షులు గంగూలి 49వ పుట్టినరోజు. అతడు జులై 8, 1972లో పుట్టాడు. రెండు దశాబ్దాల కింద గంగూలీ భారత క్రికెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు.సాహసోపేతంగా భారత జట్టును నడిపిన గంగూలీ తన ప్రేమనావనూ ధైర్యంగా ఒడ్డుకు లాక్కొచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: రెండు దశాబ్దాల కింద భారత క్రికెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన మాజీ టీమ్ ఇండియా కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ 49వ పుట్టినరోజు నేడు. అతడు జులై 8, 1972లో పుట్టాడు. ఎంతో సాహసోపేతంగా భారత జట్టును నడిపిన గంగూలీ, వ్యక్తిగత జీవితంలో.. తన ప్రేమనావనూ ధైర్యంగా ఒడ్డుకు లాక్కొచ్చాడు. అతడు తన కలలరాకుమారి దోనాను 1997లో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. మరి ఇది ముమ్మాటికీ అన్ని పెళ్లిళ్లలాంటిది కానే కాదు. దీనికి ముందు చందమామ కథలాంటి ఆకట్టుకునే ప్రేమగాధ నడిచింది వారి మధ్యలో. ఇంతకీ దాదా ప్రేమ కథేంటి?
చిన్ననాటి స్నేహమే ప్రేమగా మారింది!
సౌరవ్ గంగూలీ, అతని భార్య దోనా రాయ్ చిన్నప్పటి నుంచి ఇరుగుపొరుగునే ఉండేవారు. అయితే ఇరు కుటుంబాల మధ్య అంతగా సత్సంబంధాలేమీ లేవు. పెద్దలు ముభావంగా ఉండేవారు. అయినా అది గంగూలీ-దీనా దగ్గరవ్వకుండా అడ్డుకోలేకపోయింది. చిన్నప్పుడు ఫుట్బాల్ ప్రాక్టీస్ కోసం వెళ్లేటప్పుడు ఆమె ముఖారవిందాన్ని ప్రతిరోజూ చూసేవాడు. కొన్నిసార్లు ఆమె చదువుతున్న స్కూల్ ముందునుంచీ వెళ్లేవాడు.. కేవలం ఆమె దర్శనంకోసమే. అతడు షటిల్ ఆడేటప్పుడు షటిల్కాక్ తమ ఇంటి కాంపౌండులో ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఆమె వేచి చూసేది. పరస్పరం మట్లాడుకుంటూ, ఇచ్చిపుచ్చుకునేవారు.
అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరికి ఆరాధన భావంతో పెరిగారు. ఇద్దరూ కలిసి కోల్కతాలోని చైనీస్ రెస్టారెంట్కు వెళ్లేవారు. అతడు చాలా ఆహారం ఆర్డర్ చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయేది. కానీ అంతా తిని ముగించేవాడు. డోనా ఒడిస్సీ నృత్యకారిణి. ఆమె ఇచ్చే ప్రదర్శనలకు గంగూలీ ఠంచనుగా హాజరయ్యేవాడు. ఆమె కూడా అతడు మ్యాచులకు తప్పకుండా వచ్చేది. పెద్దల మధ్య అపార్థాలు ఉన్నా వారిద్దరూ స్నేహంగానే ఉండేవారు. ఆ స్నేహబంధమే ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా నడిపించింది.
వారిద్దరిదీ మొదట రహస్య వివాహమే!
డోనా మెచ్చిన రాకుమారుడు అప్పటికింకా భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ కాదు. అయితే అప్పటికే అతను భారత క్రికెట్లో మంచి ఆటగాడిగా ఎదుగుతున్నాడు.1996లో ఇంగ్లాండుకు టెస్ట్ మ్యాచ్కు వెళ్లే ముందు తను తిరిగొచ్చాక ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. తీరా వారు ఒకరోజు రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లేసరికి అక్కడంతా జనాలతో కోలాహలంగా ఉంది. అది చూసి వెనుదిరిగి వచ్చేశారు. తర్వాత తమ స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అతడి సమక్షంలోనే వారిద్దరూ 1996 ఆగస్టులో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాల్లోని పెద్దలకు ఈ విషయం తెలీదు.
కుటుంబ ఆశీస్సులతో మళ్లీ పెళ్లి క్రతువు!
ఇదిలా ఉంటే ఓ ఆరునెలలు గడిచాయి. ఇరువైపులా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడసాగారు. అంతలోనే ఓ స్థానిక వార్తాపత్రికలో వారిద్దరికీ రహస్యంగా పెళ్లి జరిగినట్లు వార్త ప్రచురితమైంది. ఈ విషయం తెలిసి పెద్దలు అగ్గమీద గుగ్గిలమయ్యారు. అయితే ఎలాగోలా తమ తల్లిదండ్రులను ఒప్పించి, శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య, బంధుమిత్రుల సమక్షంలో.. అందరి ఆశీస్సులతో 1997 ఫిబ్రవరిలో వారు మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
వారికి 2001లో సనా అనే ఓ కూతురు పుట్టింది. ఇదండీ.. బెంగాలీ దాదా ప్రేమ-పెళ్లి కథ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్