SA vs IND: విజృంభించిన రబాడ.. టీమ్ఇండియాను ఆదుకున్న కేఎల్ రాహుల్.. తొలి రోజు ఆట పూర్తి
సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట పూర్తయింది.
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. కగిసో రబాడ (5/44) విజృంభించడంతో తొలి రోజు 59 ఓవర్ల ఆట ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మొదటి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ.. మిడిల్ ఆర్డర్లో వచ్చిన కేఎల్ రాహుల్ (70*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్కు తోడుగా సిరాజ్ (0*) నాటౌట్గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ (38), శ్రేయస్ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24), యశస్వి జైస్వాల్ (17) పరుగులు చేశారు. రోహిత్ శర్మ (5), శుభ్మన్ గిల్ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. నండ్రీ బర్గర్ 2, మార్కో జాన్సన్ ఒక వికెట్ పడగొట్టారు.వర్షం వల్ల తొలి రోజు ఓవర్లు 31 ఓవర్లు కోల్పోవడంతో మ్యాచ్ బుధవారం అరగంట ముందుగానే (మధ్యాహ్నం ఒంటి గంట) ప్రారంభంకానుంది.
రప్ఫాడించిన రబాడ.. నిలబడిన కేఎల్ రాహుల్
భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మను రబాడ వెనక్కి పంపాడు. రోహిత్ ఫుల్షాట్ కొట్టబోయి ఫైన్లెగ్లో నాండ్రీ బర్గర్ చేతికి చిక్కాడు. కాసేపటికే నాండ్రీ తన వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ను వెనక్కి పంపాడు. వీరిద్దరూ వికెట్కీపర్ వెరినేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టడంతో భోజన విరామ సమయానికి భారత్ 91/3 స్కోరుతో నిలిచింది. లంచ్ తర్వాత రబాడ విజృంభించడంతో టీమ్ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ను చక్కటి ఇన్స్వింగర్తో క్లీన్బౌల్డ్ చేసిన రబాడ.. కాసేపటికే కోహ్లీని పెవిలియన్కు పంపాడు. తర్వాత వచ్చిన అశ్విన్ (8) స్లిప్లో వియాన్ ముల్డర్కి చిక్కాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్.. శార్దూల్ ఠాకూర్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. నిలకడగా బౌండరీలు బాదిన శార్దూల్.. షార్ట్ మిడాఫ్లో ఎల్గర్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో రబాడ ఖాతాలో ఐదో వికెట్ పడింది. టీ విరామ సమయానికి టీమ్ఇండియా 176/7 స్కోరుతో నిలిచింది. చివరి సెషన్లో నండ్రీ బర్గర్ బౌలింగ్లో రాహుల్ వరుసగా 4,6 బాది 80 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. బుమ్రా (1)ని జాన్సన్ బౌల్డ్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.