IND vs SL: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక

మరికొద్దిసేపట్లో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్‌ డాసున్‌ శనక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది...

Updated : 25 Jul 2021 19:43 IST

కొలంబో: మరికొద్దిసేపట్లో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్‌ డాసున్‌ శనక తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఇంతకుముందు జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభమైంది.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), పృథ్వీషా, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్ ‌(కీపర్‌), హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి, యుజువేంద్ర చాహల్‌

శ్రీలంక జట్టు: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్‌), ధనంజయ డిసిల్వ, చారిత్‌ అసలంక, డాసున్‌ శనక (కెప్టెన్‌), అషెన్‌ బండార, వానిండు హసరంగ, చామిక కరుణరత్నె, ఇసురు ఉదాన, అఖిల ధనంజయ, దుష్మంత చమీరా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని