IPL 2024: ఐపీఎల్ 2024.. సగం సీజన్కు సీఎస్కే స్టార్ బ్యాటర్ దూరం!
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ తగిలింది. గత సీజన్లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఈసారి సగభాగానికి దూరం కానున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి 15 రోజుల షెడ్యూల్ను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రాక్టీస్ను కూడా మొదలుపెట్టాడు. అయితే, సీఎస్కేకు చిన్నపాటి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డేవన్ కాన్వే ఈ సీజన్ తొలి భాగంలో ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. అతడిని పరిశీలించిన వైద్యబృందం శస్త్రచికిత్స అవసరమని.. కనీసం 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. రెండు నెలలపాటు క్రికెట్కు దూరం ఉంటాడు. దీంతో ఏప్రిల్ చివరినాటికి సిద్ధమై.. రెండో సగానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గత సీజన్లో సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కాన్వేనే. 16 మ్యాచుల్లో 672 పరుగులు చేశాడు. అయితే, సీఎస్కే నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై తొలి మ్యాచ్లో తలపడనుంది.
ఆరెంజ్ క్యాప్ అతడిదే: చాహల్
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను ఎవరు సొంతం చేసుకుంటారనే దానిపై యుజ్వేంద్ర చాహల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ లేదా జోస్ బట్లర్ టాప్ స్కోరర్గా నిలుస్తారని వ్యాఖ్యానించాడు. ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. ‘‘ఆరెంజ్ క్యాప్ వారిద్దరిలో ఒకరు దక్కించుకుంటారు. అలాగే ఎక్కువ వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ను నేను సొంతం చేసుకుంటా (నవ్వుతూ). నా తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ ఉంటాడు’’ అని చాహల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!