IND vs WI : 15 రోజుల ముందే వెళ్లొచ్చు కదా.. ఆ పొరబాట్ల నుంచి నేర్చుకోరా..?: గావస్కర్
టీమ్ఇండియా(Team India) తన తప్పుల నుంచి నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్ : WTC Finalలో టీమ్ఇండియా(Team India) దారుణ వైఫల్యం అనంతరం.. రోహిత్ సేనపై విమర్శల దాడి పెరిగింది. సరైన ప్రిపరేషన్ లేకపోవడమే తమ ఓటమికి కారణమని సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) పేర్కొన్న విషయం తెలిసిందే. వెస్టిండీస్(IND vs WI)తో మ్యాచ్లు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రోహిత్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) టీమ్పై మండిపడ్డాడు.
టీమ్ఇండియా చేసిన తప్పులను సరిదిద్దుకుంటున్నట్లు కనిపించడం లేదని గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. WTC Final తర్వాత విండీస్ పర్యటనకు దాదాపు నెల రోజుల సమయం దొరికినా.. టీమ్ఇండియా సన్నద్ధత తీరుపై విమర్శలు గుప్పించాడు. ‘‘మనం ఎలాంటి సన్నద్ధత గురించి మాట్లాడుకుంటున్నాం? టీమ్ఇండియా విండీస్ పర్యటనకు వెళ్లింది. ఇప్పటికే మీరు WTC Finalలో ఓడిపోయి ఉన్నారు. ఆ తర్వాత మీరేమైనా మ్యాచ్లు ఆడారా? 20-25 రోజులు ఏం చేశారు. ప్రిపరేషన్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు.. దానికి కట్టుబడి ఉండాలి కదా. 15 రోజుల ముందే వెళ్లి రెండు వార్మప్ మ్యాచ్లు ఆడొచ్చు కదా’ అని గావస్కర్ విమర్శించాడు.
ముందుగానే ఆటగాళ్లు అక్కడికి వెళ్లరని.. జట్టులో వారి స్థానాలు పదిలంగా ఉండటమే ఇందుకు కారణమని గావస్కర్ పేర్కొన్నారు. ఇలా ముందుగా వెళ్తే.. పని భారం కూడా పెరుగుతుందని భావించడం అసలు అర్థం కాని విషయమని తెలిపాడు.
- ఇదీ చదవండి.. : అప్పుడు ఆడిన వాళ్లలో ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం
‘ప్రధాన ఆటగాళ్లు ముందుగా వెళ్లకపోవడానికి కారణం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాము జట్టులో ఉంటామనే నమ్మకం. ఒకవేళ ముందుగా వెళ్తే.. పనిభారం గురించి మాట్లాడతారు. ప్రపంచంలోనే అత్యంత ఫిట్నెస్ కలిగిన జట్టు అని మీరు చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ టీ20 క్రికెట్ యుగంలో పనిభారం మీకు ఎలా సమస్య అవుతుంది?’ అని గావస్కర్ ప్రశ్నించాడు.
ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న విండీస్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది. జులై 12 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. 20 నుంచి రెండు టెస్టు ఆరంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.