MS Dhoni: ధోనీ ఆటోగ్రాఫ్ ప్లీజ్.. హోంగ్రౌండ్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడేసిన సీఎస్కే
ఐపీఎల్ సీజన్లో (IPL 2023) ముగింపు దశకు చేరుతోంది. రెండు వారాల్లో ఫైనల్ మ్యాచ్ ఉంది. వచ్చే వారం నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ క్రమంలో సీఎస్కే (CSK) లీగ్ స్టేజ్లో హోంగ్రౌండ్ వేదికగా చివరి మ్యాచ్ను ఆడేసింది. ఇంటా, బయటా పద్ధతిలో ఏడేసి మ్యాచ్లు జరుగుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL 2023) సీజన్ లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరాయి. కొన్ని జట్లకు ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగా.. మరికొన్నింటికి రెండేసి ఉన్నాయి. తాజాగా చెన్నైసూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల (CSK vs KKR) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో సీఎస్కే ఓటమిపాలైంది. అయినా ప్లేఆఫ్స్ అవకాశాలకు ఇప్పటికైతే ఇబ్బందేమీ లేదు. చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సీజన్లో లీగ్ స్టేజ్లో సొంతమైదానం వేదికగా చెన్నై జట్టుకు ఇదే చివరి మ్యాచ్ కావడం విశేషం. దీంతో తమ జట్టుకు మద్దతుగా నిలిచేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కానీ, ఫలితం సీఎస్కేకు సానుకూలంగా రాలేదు. అయితే, ఈ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మ్యాచ్ ముగిశాక.. చెన్నై ఆటగాళ్లు మైదానమంతా కలియతిరిగారు. టెన్నిస్ రాకెట్లను పట్టుకుని జెర్సీలను అభిమానుల వైపు విసురుతూ.. సీఎస్కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మైదానంలోకి వచ్చి ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ను తీసుకోవడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం సన్నీ మాట్లాడుతూ.. ‘‘వచ్చే మ్యాచ్ల నుంచి నాకు మరో పింక్ షర్ట్ ఇవ్వండి’’ అని వ్యాఖ్యానించాడు. ఎంఎస్ ధోనీకిదే చివరి సీజన్ అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సీఎస్కే హోంగ్రౌండ్ వేదికగా ఆఖరి మ్యాచ్ ఆడటంతో అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన చెన్నై 15 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. దిల్లీ క్యాపిటల్స్తో దిల్లీ వేదికగా మే 20న చెన్నై ఆడనుంది. దీంతో ఇరు జట్లకూ లీగ్ స్టేజ్ పోరు ముగుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్