Boxing Day Test : టీమ్ఇండియా వరుసగా మూడోసారి ‘బాక్సింగ్ డే’ విజయం
బాక్సింగ్ డే టెస్టు.. క్రిస్మస్ మరుసటి రోజు డిసెంబర్ 26న ప్రారంభమై...
ఇంటర్నెట్ డెస్క్: బాక్సింగ్ డే టెస్టు.. క్రిస్మస్ మరుసటి రోజు డిసెంబర్ 26 నుంచి ప్రారంభమై 30వ తేదీన ముగిసే మ్యాచ్ అంటే ఎంతో ప్రత్యేకమైంది. అయితే 1865 నుంచి ఆసీస్ తలపడే మ్యాచ్లకు మాత్రమే ‘బాక్సింగ్ డే టెస్టు’ అని వాడుతుండేవారు. ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్లో ఏదొక మ్యాచ్ బాక్సింగ్ డే రోజున మెల్బోర్న్ వేదికగా ఉండేలా షెడ్యూల్ తయారు చేసేవారు. ఇతర దేశాలతోనూ బాక్సింగ్ డే టెస్టుల్లో ఆసీస్ తలపడిన సందర్భాలూ ఉన్నాయి. అయితే అదే తేదీన ఇతర జట్లూ ఆడే టెస్టులను ‘బాక్సింగ్ డే’ టెస్టులు పిలవకపోయినా.. అలాగే వ్యవహరించేవారు. ఇప్పటి వరకు టీమ్ఇండియా 10 బాక్సింగ్ డే టెస్టులను ఆడింది. అందులో తొమ్మిదిసార్లు ఆసీస్తో, ఒకసారి దక్షిణాఫ్రికాతో ఆడింది. అయితే మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. మరి ఎప్పుడు ఆడిందో తెలుసుకుందాం..
వరుసగా మూడోసారి విజయం..
టీమ్ఇండియా 1985 నుంచి బాక్సింగ్ డే టెస్టుల్లో తలపడుతోంది. ఇవాళ దక్షిణాఫ్రికాపై విజయంతో కలుపుకొని కేవలం మూడు సార్లు మాత్రమే గెలవడం గమనార్హం. అదీనూ వరుసగా కావడం విశేషం. ఇందులో రెండుసార్లు విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. ఒకసారి అజింక్య రహానె నేతృత్వంలో విజయాలను అందుకుంది.
* కోహ్లీ నేతృత్వంలోని భారత్ 2018లో ఆసీస్ పర్యటనకు వెళ్లింది. బాక్సింగ్ డే రోజున ప్రారంభమైన మూడో టెస్టులో టీమ్ఇండియా 137 పరుగుల తేడాతో విజయం సాధించింది.
* మరోసారి 2020లో కోహ్లీ నాయకత్వంలోనే ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే రెండో టెస్టు నాటికి కోహ్లీ పితృత్వపు సెలవుల మీద భారత్కు వచ్చేశాడు. దీంతో అజింక్య రహానె సారథ్య బాధ్యతలు చేపట్టాడు. మూడో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు)లో టీమ్ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది.
* ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కోహ్లీ కెప్టెన్సీలో గెలిచింది. వరుసగా మూడోసారి కూడానూ బాక్సింగ్ డే టెస్టును సొంతం చేసుకున్న జట్టుగా నిలిచింది. అంతేకాకుండా సెంచూరియన్ మైదానంలో భారత్ తొలిసారి విజయం సాధించడం విశేషం.
ఇప్పటివరకు ఆసీస్తోనే తొమ్మిదిసార్లు
గత మూడు దశాబ్దాలకుపైగా భారత జట్టు తొమ్మిది సార్లు ఆసీస్తో బాక్సింగ్ డే టెస్టులో తలపడింది. కేవలం రెండు విజయాలను మాత్రమే నమోదు చేయగా.. ఐదు సార్లు ఓటమి తప్పలేదు. మరో రెండు మ్యాచులను డ్రాగా ముగించింది.
* 1985 - డ్రా మ్యాచ్ ..
* 1991 - ఎనిమిది వికెట్ల తేడాతో ఆసీస్ విజయం ..
* 1999 - 180 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం ..
* 2003 - తొమ్మిది వికెట్లతో ఆసీస్ విజయం ..
* 2007 - 337 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం ..
* 2011 - 122 పరుగుల తేడాతో ఆసీస్ విజయం ..
* 2014 - డ్రా మ్యాచ్ ..
* 2018 - ఆసీస్పై 137 పరుగుల తేడాతో భారత్ విజయం ..
* 2020 - ఆసీస్పై ఎనిమిది వికెట్లతో భారత్ విజయం..
* 2021 - దక్షిణాఫ్రికాపై 113 పరుగుల తేడాతో భారత్ విజయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!