IPL 2022: మెగా ఐపీఎల్లో ఆ రెండు సంస్థలకే కొత్త జట్లు!
వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 మెగా ఈవెంట్ పది జట్లతో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఉన్న ఎనిమిది జట్లకు తోడు మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలు ఇందులో భాగంకానున్నాయి...
ఇంటర్నెట్డెస్క్: వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 మెగా ఈవెంట్ పది జట్లతో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఉన్న ఎనిమిది జట్లకు తోడు మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలు ఇందులో భాగంకానున్నాయి. కొత్తగా చేరే జట్లు ఖరారు కాగానే త్వరలో ఆటగాళ్ల మెగా వేలం కూడా నిర్వహించనున్నారు. అయితే, ఆ రెండు కొత్త జట్లను ఎవరు కొనుగోలు చేస్తున్నారనేదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాటి కోసం అహ్మదాబాద్, లఖ్నవూ నగరాలు పోటీలో ఉన్నాయి. అందులో ఒకదాన్ని సొంతం చేసుకునేందుకు భారత్కు చెందిన ‘ఆదాని గ్రూప్’ ఆసక్తి చూపిస్తుండగా మరోదానిపై ‘మాంచెస్టర్ యునైటెడ్ ప్రీమియర్ లీగ్’ యాజమాన్యం ‘గ్లేజర్ కుటుంబం’ ఆసక్తి చూపిస్తున్నట్ల తెలిసింది.
మరోవైపు ఈ రెండు ఫ్రాంఛైజీల కోసం మొత్తం 11 సంస్థలు పోటీపడుతున్నాయని సమాచారం. అయితే, అందులో ప్రధానంగా ఆదాని, గ్లెజర్ కుంటుంబాలకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు సంస్థలు రూ.7వేల కోట్ల నుంచి 10వేల కోట్ల దాకా వెచ్చించి కొత్త ఫ్రాంఛైజీలను చేజిక్కించుకునే వీలుందని బీసీసీఐ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఐపీఎల్లో ఇలా కొత్త జట్లు చేరడం ఇదే మొదటిసారి కాదు. 2010లో పుణె వారియర్స్, కొచీ టస్కర్స్ పాల్గొన్నాయి. తర్వాత మెగా ఈవెంట్ నుంచి వాటిని తొలగించారు. అలాగే 2016, 2017లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లను నిషేధించినప్పుడు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ను తాత్కాలికంగా ప్రవేశపెట్టారు.
ఆసక్తిగా ఉన్న సంస్థలు..
* సంజీవ్ కుమార్ - ఆర్పీఎస్జీ
* గ్లేజర్ ఫ్రామిలి - మాచెంస్టర్ యునైటెడ్ ఓనర్స్
* ఆదాని గ్రూప్
* నవీన్ జిందాల్ - జిందాల్ పవర్ అండ్ స్టీల్
* టొర్రెంట్ ఫార్మా
* రోనీ స్క్రూవాలా
* అరబిందో ఫార్మా
* కోటక్ గ్రూప్
* సీవీసీ పార్ట్నర్స్
* సింగపూర్కు చెందిన పీఈ సంస్థ
* హిందుస్థాన్ టైమ్స్ (మీడియా)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?