ఆ ముగ్గురు విఫలమవుతున్నా టీమ్ఇండియా విజయాలు సాధించడం ఆశ్చర్యకరం: పఠాన్
మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, రహానె, పుజారా బ్యాటింగ్లో విఫలమవుతున్నా టీమ్ఇండియా టెస్టుల్లో విజయం సాధించడం...
ఇంటర్నెట్ డెస్క్: మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ, రహానె, పుజారా బ్యాటింగ్లో విఫలమవుతున్నా టీమ్ఇండియా టెస్టుల్లో విజయం సాధించడం ఆశ్చర్యకరంగా ఉందని మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. ‘‘గత రెండేళ్లుగా మిడిలార్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. అయినా సరే ఓపెనర్లు, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు, బౌలర్లు రాణించడం వల్లే భారత్ విజయాలను నమోదు చేయగలిగింది’’ అని తెలిపాడు. గత రెండేళ్ల నుంచి కోహ్లీ 14 టెస్టుల్లో 26.08 సగటుతో 652 పరుగులు మాత్రమే చేశాడు. పుజారా కూడా 19 మ్యాచుల్లో 2652 సగటుతో 868 పరుగులు... రహానె 24.22 సగటుతో 17 టెస్టుల్లో 751 పరుగులు సాధించాడు. ముగ్గురు బ్యాటర్లలో రహానె ఒక్కడే సెంచరీ చేశాడు. అయినా సరే ఆసీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మీద సిరీస్లను భారత్ సొంతం చేసుకుంది.
టెస్టు క్రికెట్ కెరీర్లో అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా బ్యాటింగ్ యావరేజ్ తగ్గిపోవడం తననెంతో నిరుత్సాహానికి గురి చేసిందని ఇర్ఫాన్ తెలిపాడు. అలానే దక్షిణాఫ్రికాతో సిరీస్లోనూ విఫలం కావడం బాధాకరమని వ్యాఖ్యానించాడు. సీనియర్ బ్యాటర్లకు కుదురుకోవడానికి ఎక్కువ సమయం లేదని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారని గుర్తు చేశాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో పుజారా 3 పరుగులు (33 బంతుల్లో), రహానె (0) గోల్డెన్డకౌట్గా వెనుదిరిగాడు. మొదటి టెస్టులో రహానె (48, 20) కాస్త ఫర్వాలేదనిపించగా.. పుజారా (0, 16) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
ఈ క్రమంలో వారి ప్రదర్శనపై ఇర్ఫాన్ విశ్లేషిస్తూ.. ‘‘ తొలి టెస్టులో అజింక్య రహానె ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. అతడి ఫుట్వర్క్ కూడా బాగుంది. ఎంతో పాజిటివ్ దృక్పథంతో ఆడాడు. అయితే రెండో టెస్టులో (జోహన్నెస్బర్గ్) మాత్రం పుజారాతోపాటు రహానె కూడా నిరుత్సాహపరిచాడు. ఇప్పటివరకు ఒక్కొక్కరు భారత్ కోసం 80కిపైగా టెస్టులను ఆడారు. బ్యాటింగ్ యావరేజ్ 40 కంటే ఎక్కువ ఉండాలి. అయితే గత మూడు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే ప్రదర్శన దారుణంగా ఉంది. అంతేకాకుండా వారి బ్యాటింగ్ సగటు కూడానూ 30 దిగువకు పడిపోయింది. ఇదే నన్ను చాలా నిరాశపరిచింది. మరోవైపు పుజారా, రహానెకు కుదురుకోవడానికి మరీ ఎక్కువ సమయం లేదనుకుంటున్నా. ఎందుకంటే టెస్టు కెరీర్ అరంగేట్రంలోనే శతకం చేసి శ్రేయస అయ్యర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. యువ ఆటగాళ్లు తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు" అని వివరించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 202 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
ఐపీఎల్-2024లో రికార్డు ఛేజింగ్తో కోల్కతాపై పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. -
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?