MS Dhoni: ధోనీ ట్విటర్ ఖాతాకు ఏమైంది?
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ట్విటర్ ఖాతాలో శుక్రవారం గందరగోళం నెలకొంది. తొలుత అతడి ఖాతాకు వెరిఫైడ్ అకౌంట్ (బ్లూ టిక్) మార్కును తొలగించిన ట్విటర్ సంస్థ తర్వాత మళ్లీ జోడించడం చర్చనీయాంశంగా మారింది...
వెరీఫైడ్ బ్లూ టిక్ తొలగించి మళ్లీ జోడించిన ట్విటర్..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ట్విటర్ ఖాతాలో శుక్రవారం గందరగోళం నెలకొంది. తొలుత అతడి ఖాతాకు వెరిఫైడ్ అకౌంట్ (బ్లూ టిక్) మార్కును తొలగించిన ట్విటర్ సంస్థ తర్వాత మళ్లీ జోడించడం చర్చనీయాంశంగా మారింది. సహజంగా ధోనీ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు ఈ ఏడాది జనవరి 8న చివరిసారి ట్వీట్ చేశాడు. దాంతో చాలా రోజులుగా ధోనీ తన ఖాతాను వినియోగించడం లేని కారణంగా వెరిఫైడ్ అకౌంట్ తొలగించి ఉంటారని తెలుస్తోంది. ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో తర్వాత మళ్లీ ట్విటర్ సంస్థ ధోనీ ఖాతాకు బ్లూ టిక్ను జోడించింది.
చివరిసారి ఈ ఏడాది జనవరి 8న ఓ పోస్టు చేసిన ధోనీ.. తాను స్ట్రాబెరీలను పండిస్తే మార్కెట్కు తీసుకెళ్లేందుకు ఒక్కటి కూడా మిగలదని పేర్కొన్నాడు. అప్పుడు స్ట్రాబెరీ పంట ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. కాగా, ఆ పోస్టు పెట్టి సుమారు ఆరు నెలలు దాటిపోయిన నేపథ్యంలోనే ధోనీ ట్విటర్ ఖాతా నుంచి బ్లూ టిక్ తొలగించినట్లు అర్థమవుతోంది. కాగా, ఎవరైనా యూజర్లు ట్విటర్లో వెరిఫైడ్ ఖాతాదారులుగా కొనసాగాలంటే కనీసం ఆరు నెలల్లో ఒకసారైనా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే, ధోనీ ఆ పరిమితి మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ధోనీ ఖాతాను 8.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండటం విశేషం. ధోనీ 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో విఫలమైన చెన్నై టీమ్ను ఈసారి మళ్లీ ఫామ్లోకి తీసుకొచ్చాడు. కరోనా కేసుల నేపథ్యంలో మే 4న అర్ధాంతరంగా నిలిచిపోయిన 14వ సీజన్లో జట్టును టాప్ రెండులో నిలబెట్టాడు. ఇక ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్లను మళ్లీ సెప్టెంబర్-అక్టోబర్లో యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దాంతో ధోనీ ఆట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్