రికార్డు ‘8’పై పేస్ గురి
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్పై గురిపెట్టాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్లో బరిలో దిగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు...
కోల్కతా: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రికార్డు స్థాయిలో ఎనిమిదో ఒలింపిక్స్పై గురిపెట్టాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్లో బరిలో దిగాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘2020 ఒలింపిక్స్లో చివరి గర్జన’ అంటూ 2019 క్రిస్ట్మస్ రోజున పేస్ పేర్కొన్నాడు. అయితే కరోనా కారణంగా ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ‘‘ఇంతపెద్ద కరోనా మహమ్మారి చుట్టుముడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ మహమ్మారి ప్రతి ఒక్కరిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేసింది. కానీ సుదీర్ఘ విరామం తర్వాత చాలా సంతోషంగా ఉంది. శారీరకంగా, మానసికంగా పూర్తి సన్నద్ధంగా ఉన్నా. చరిత్ర పుస్తకాల్లో భారత్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే నాకు ముఖ్యం. అందుకే 30 ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్నా. ఇప్పటికే ఏడు ఒలింపిక్స్లలో పాల్గొన్న రికార్డు నాకుంది. ఎనిమిదో ఒలింపిక్స్లోనూ పాల్గొనగలను. టెన్నిస్లో అత్యధిక ఒలింపిక్స్లు ఆడిన రికార్డు భారత్ పేరిట నిలిచిపోతుంది. టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని అనుకుంటున్నా’’ అని పేస్ తెలిపాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ నాటికి పేస్ 48వ పడిలో అడుగుపెడతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.