Suryakumar Yadav: త్వరలో టెస్టుల్లోకి వస్తా: సూర్యకుమార్ యాదవ్
టెస్టు క్రికెట్ అరంగేట్రంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తన ఆట తీరు గురించి వివరించాడు.
ఇంటర్నెట్డెస్క్: మిస్టర్ 360 త్వరలో భారత టెస్టు జట్టులో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం న్యూజిలాండ్పై ‘గాడ్మోడ్’లో ఆడిన 111 పరుగుల ఇన్నింగ్స్ అనంతరం అతడు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రంపై స్పందించాడు. ‘‘ కెరీర్ ఆరంభించిందే ఎర్రబంతి క్రికెట్ (టెస్టులు)తో. నా ముంబయి జట్టు కోసం ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాను. టెస్టు క్రికెట్పై నాకు మంచి అవగాహన ఉంది. ఆ ఫార్మాట్ ఆడటాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. త్వరలోనే టీమ్ ఇండియా టెస్టు క్రికెట్ క్యాప్ను అందుకొంటానని ఆశిస్తున్నాను’’ అని సూర్యకుమార్ తన మనసులోని మాట చెప్పాడు.
గతాన్ని గుర్తుంచుకొంటాను..
బాగా ఆడిన సమయంలో కూడా టీమ్ ఇండియా నుంచి పిలుపు రాకపోవడంతో నిరాశకు గురైన సందర్భాలను తాను మర్చిపోనని సూర్యకుమార్ వెల్లడించాడు. ‘‘ నా గతాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే ముందుకెళ్తాను. నేను ఒక్కడినే ఉన్నా.. నా భార్యతో ప్రయాణిస్తున్నా.. రెండు మూడేళ్ల క్రితం పరిస్థితి ఏంటి.. ప్రస్తుత పరిస్థతి ఏమిటని చర్చించుకుంటాం. అప్పటికీ ఇప్పటికీ ఏం మారిందో మాట్లాడుకుంటాం. అప్పట్లో కొంత నిరాశ ఉండేది. కానీ, దానిలో కూడా ఏదో ఒక ఆశాకిరణం వెతికే వాళ్లం. మరింత మెరుగైన క్రికెటర్గా ఎలా మారగలను అని ఆలోచించేవాణ్ని. ఆ తర్వాత కొంత భిన్నంగా ప్రయత్నించాను. సరైన ఆహారం, నాణ్యమైన సాధన, మంచి నిద్ర వంటివి వాటిల్లో ఉన్నాయి. ఆ ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాను. బాగా ఆడినా.. ఆడకపోయినా.. నేను మ్యాచ్ పూర్తయ్యాక.. హైలైట్స్ చూస్తాను. ఆ సమయంలో కొన్ని సార్లు నా షాట్లను చూసి నేనే ఆశ్చర్యపోతాను’’
అతిగా ఆలోచించను..
‘‘మ్యాచ్ను మించి నేను ఆలోచించను. ఒక వేళ ఆటకు అవసరమైనదాని కంటే.. బౌలర్ల కంటే ఎక్కువగా ఆలోచిస్తే.. ప్లానింగ్ తప్పుదారి పడుతుంది. అందుకే వాస్తవిక పరిస్థితుల్లోనే ఉంటాను. అతిగా ఆలోచించను. బాగా ఆడిన సమయంలో అనుసరించిన రోజువారీ విధానాలను, సాధనను ఎప్పుడూ కొనసాగించాలని నేను అనుకుంటాను. 99శాతం అదే చేయడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణకు నేను జిమ్ చేస్తాను. సరైన సమయానికి భోజనం ముగిస్తాను. 15-20 నిమిషాలు కునుకు తీస్తాను. ఇవి చిన్న చిన్న విషయాలే. కానీ, మ్యాచ్ ఉన్న రోజుల్లో కూడా నేను ఇవే చేయడానికి యత్నిస్తాను. మైదానంలోకి వచ్చేటప్పటికి ఉత్సాహంగా ఉంటాను’’
ఆఫ్డేస్లో కుటుంబంతోనే..
‘‘నేను మ్యాచ్లు లేని రోజుల్లో చాలా సమయం కుటుంబంతోనే గడుపుతాను. ఆ సమయంలో వారు ఎప్పుడూ ఆట గురించి నాతో మాట్లాడరు. అది నన్ను సాధారణంగా ఉండేలా చేస్తుంది. అది చాలా ముఖ్యం. దీంతో చాలా సమయం సౌకర్యవంతమైన పరిస్థితుల్లో ఉండగలుగుతాను’’ అని సూర్యకుమార్ వివరించాడు.
విరాట్ ట్విటర్లో ‘వీడియో గేమ్’ ఇన్నింగ్స్ కామెంట్పై..
‘‘ఇటీవల కాలంలో మేమిద్దరం కలిసి కొన్ని గేమ్స్ ఆడాం. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. నేను కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తాను. ఎందుకంటే అతడు సూపర్ ఫిట్. కానీ, మేము కలిసి ఉన్న రోజుల్లో గేమ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోం. ఎందుకంటే..? మేము పరస్పరం ఒకరి ఆటతీరును మరొకరు గౌరవించుకొంటాం. కలిసి ఆడే సమయంలో.. నేను విరాట్కు ఒక్కటే చెబుతాను.. ‘నువ్వు ఒక వైపు ఆడు.. నేను మరో వైపు ఆడతాను’.. విరాట్ కూడా ఎక్కువగా ఏమీ చెప్పడు. నీదైన శైలిలో బ్యాట్ను ఝుళిపించి ఎంజాయ్ చెయ్యి అంటాడు’’ అని సూర్యాకుమార్ వెల్లడించాడు. విరాట్ ట్వీట్పై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘సోదరా’ అని సంతోషంతో హగ్గింగ్, నజర్ ఎమోజీలని షేర్ చేశాడు.
కీవ్ బౌలర్లను దంచి కొట్టడంపై..
‘‘మైదానంలో ఫీల్డింగ్ ప్లేస్మెంట్ల ఆధారంగా స్ట్రోక్స్ను ఆడాను. మీరు ఎక్కడ ఆడుతున్నారు అన్నదానితో సంబంధం లేకుండా ఫార్మాట్ ప్రకారం ఆడాలి. మీ మెదడులో ఆటకు సంబంధించి ఓ ప్రణాళిక ఉండాలి. పిచ్ ఎలా ఉంది. మైదానం కొలతలు ఏమిటీ, బంతి ఎలా కదులుతోంది.. వంటివి మీ మెదడులో ఉండాలి. మిగిలిన పని మొత్తం వీటి ఆధారంగా ప్రాక్టిస్ సెషన్లో, మీరు మీ రూమ్లో ఉన్నప్పుడు చేయాలి. ఆట మొదలయ్యే సమయానికి అతిగా ఆలోచించకుండా ఉండాలి. స్పష్టమైన ప్లాన్తో, సానుకూల దృక్పథంతో, మంచి ఉద్దేశంతో మైదానంలో అడుగుపెట్టి మ్యాచ్ను ఎంజాయ్ చేయాలి’’ అని ఈ మిస్టర్ 360 పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ