IND vs AUS : ఈ సిరీస్ అశ్విన్కు ట్రయల్ కాదు.. అవకాశం మాత్రమే: ద్రవిడ్
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్(IND vs AUS)కు అశ్విన్ను జట్టులోకి తీసుకోవడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మెగా టోర్నీ(ODI World Cup 2023) ముందు ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్(IND vs AUS)కు సిద్ధమైంది. ఆసియా కప్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేనకు.. తమను తాము పరీక్షించుకునేందుకు ఇది మరో అవకాశం. తొలి రెండు మ్యాచ్లకు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన మేనేజ్మెంట్.. అక్షర్ పటేల్ గాయం కారణంగా వెటరన్ స్పిన్నర్ అశ్విన్(Ravichandran Ashwin)కు జట్టులో చోటు కల్పించింది. ఒకవేళ అక్షర్ కోలుకోకపోతే అశ్విన్ ప్రపంచకప్నకూ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడి సత్తా నిరూపించుకునేందుకు ఈ సిరీస్ ఓ పరీక్షలాంటిదని పలువురు అంటున్నారు. దీనిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) స్పందించాడు. ఇది అతడికి ట్రయల్ కాదని స్పష్టం చేశాడు.
‘అశ్విన్ ఎంతో అనుభవమున్న ఆటగాడు. నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఎంతో సహకారం అందిస్తున్నాడు. ఈ సిరీస్ అశ్విన్కు ట్రయల్ లాంటిది కాదు. ఈ ఫార్మాట్లో అతడికిది అవకాశం మాత్రమే’ అని ద్రవిడ్ వివరించాడు. ఇక అశ్విన్ చాలా కాలంగా వన్డేలకు దూరంగా ఉన్న విషయంపై స్పందిస్తూ..‘మా ప్రణాళికల్లో అతడు ఎప్పుడూ భాగమే. అతడు గత సంవత్సర కాలంగా ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదని తెలుసు. అయితే.. అతడు తన అనుభవంతో దాన్ని ఎదుర్కొంటాడు’ అని పేర్కొన్నాడు.
ఇక ఈ సిరీస్.. ఇటు ఇండియాతోపాటు ఆస్ట్రేలియాకు కూడా ఎంతో కీలకమే. వన్డే ప్రపంచకప్ ముందు తమ జట్టలోని లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు ఇది మంచి అవకాశం. ఈ సిరీస్లో భాగంగా నేడు మొహాలిలో తొలి వన్డే జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.


తాజా వార్తలు (Latest News)
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
-
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
-
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
-
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
-
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు