T20 World Cup: హార్దిక్ ఫిట్.. ఆ విషయం ఇప్పుడే చెప్పలేను: కోహ్లీ
టీ20 ప్రపంచకప్లో కీలకమైన పోరుకు ముందు టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్నెస్పై సారథి విరాట్...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో కీలకమైన పోరుకు ముందు టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్నెస్పై సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్య పాకిస్థాన్తో మ్యాచ్లో స్వల్పంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య ఫిట్నెస్పై అనేక సందేహాలు తలెత్తాయి. అయితే పాండ్య ఫిట్నెస్పై నెలకొన్న అనుమానాలకు కోహ్లీ తెరదించాడు. హార్దిక్ పాండ్య భుజం నొప్పి నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ఇప్పుడు చాలా బాగున్నాడని చెప్పాడు. అయితే ఆదివారం కివీస్తో జరిగే మ్యాచ్లో ఆడతాడో లేదో మాత్రం ధ్రువీకరించకపోవడం గమనార్హం. ఒకవేళ పాండ్య ఫిట్నెస్ సాధించకపోతే.. హార్దిక్ స్థానంలో శార్దూల్ను తీసుకునే అవకాశాలపైనా కోహ్లీ స్పష్టత ఇవ్వలేదు. అయితే జట్టు యాజమాన్యం ప్రణాళికల్లో మాత్రం శార్దూల్ ఠాకూర్ ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో కివీస్తో మ్యాచ్కు తుది జట్టులో పాండ్య ఉండకపోవచ్చేనే సంకేతాలను ఇచ్చినట్లుగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హార్దిక్ పాండ్య బౌలింగ్ వేయలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం టీమ్ఇండియా మేనేజ్మెంట్ శార్దూల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘మా ప్రణాళికల్లో శార్దూల్ ఎప్పుడూ ఉంటాడు. అయితే శార్దూల్ పాత్ర ఏమిటి..? అతడు ఎక్కడ ఫిట్ అవుతాడనే విషయాలను ఇప్పుడే చెప్పలేను. అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. అతడు ఉండటం జట్టుకు ఎప్పుడూ అదనపు బలమే’’ అని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్య వెన్నునొప్పి సమస్యకు గురైనప్పటి నుంచి బౌలింగ్ చేయనేలేదు. జట్టులో స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఉన్నాడు. అయితే గత ఐపీఎల్, పాక్తో మ్యాచ్లో విఫలం కావడంతో శార్దూల్ను తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కివీస్తో మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
ఐపీఎల్-2024లో రికార్డు ఛేజింగ్తో కోల్కతాపై పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. -
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM