Virat kohli: నాపై ఉన్న ఆశీస్సుల ఫలితమే నువ్వు.. శ్రీమతిపై విరాట్‌ పోస్ట్‌

తమ వివాహ బంధానికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా అనుష్క శర్మ తనకు ఎంత ప్రత్యేకమో తెలుపుతూ విరాట్‌ ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు. 

Published : 11 Dec 2022 18:34 IST

దిల్లీ: విరాట్‌ కోహ్లీ(Virat kohli), అనుష్క శర్మ(Anushka sharma) దంపతులకు డిసెంబర్‌ 11వ తేదీ మరిచిపోలేనిది. 2017లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఆదివారం వీరిద్దరూ తమ ఐదో పెళ్లిరోజు వేడుకలు(Wedding anniversary) చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అనుష్కను తన జీవితంలోకి ఆహ్వానించడం ఎంత గొప్ప నిర్ణయమో తెలియజేస్తూ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ ద్వారా తెలిపాడు. 

‘‘నీతో కలిసి జీవితాంతం చేయనున్న ప్రయాణానికి నేటితో ఐదేళ్లు పూర్తి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా.. నాపై ఉన్న ఆశీస్సుల ఫలితంగానే  నిన్ను పొందగలిగాను’’ అంటూ కోహ్లీ అనుష్కతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశాడు. దీనికి అనుష్క సరదాగా స్పందించింది. ‘‘ఇంకా నయం నువ్వు ముందుగా అనుకున్నది పోస్ట్‌ చేయలేదు’’ అంటూ తెలిపింది. దీనిని బట్టి అనుష్క గురించి ఎంతో చెప్పాలని విరాట్‌ మొదట అనుకున్నాడని తెలుస్తోంది. కానీ, చివరకు ఈ చిన్నపోస్ట్‌తో సరిపెట్టి ఉంటాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్‌ చేసిన రెండు గంటల్లోనే ఈ ఫొటో 4 మిలియన్లకు పైగా లైకులు సాధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని