IND vs PAK: మీ అంకుల్ అబ్బాయి అడిగాడని ఆ జెర్సీ తీసుకొంటే బాగుండేది: బాబర్పై వసీమ్ వ్యంగ్యాస్త్రాలు
భారత్ చేతిలో పాక్ ఓడిపోవడంపై (IND vs PAK) ఆ జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి మాజీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అదే క్రమంలో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తీరుపై వసీమ్ అక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) పాకిస్థాన్పై టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. తమ జట్టు కనీసం పోరాడకుండానే చేతులెత్తేయడంపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో పాక్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) కెప్టెన్ బాబర్ అజామ్ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ నుంచి బాబర్ జెర్సీలను (Babar Azam) తీసుకోవడం సరికాదని వ్యాఖ్యానించాడు. దానికి ఇది తగిన సమయం కాదని పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ అక్రమ్ అసహనం వ్యక్తం చేశాడు.
‘‘విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి సమయంలో బాబర్ జెర్సీలను పబ్లిక్గా తీసుకోకుండా ఉండాల్సింది. డ్రెస్సింగ్ రూమ్ వద్ద తీసుకుంటే బాగుండేదేమో. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానో కూడా చెబుతా. సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలను చూసినప్పుడు కామెంట్ చేయాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం అలా చేయకుండా ఉండాల్సింది. ఒకవేళ మీ అంకుల్ వాళ్ల అబ్బాయి కోహ్లీ జెర్సీని అడిగితే.. ఆట అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ వద్ద ప్రైవేట్గానే ఆ జెర్సీలను తీసుకోవాల్సింది’’ అని వసీమ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
ఇదేం ఆట..? కనీసం పోరాడాల్సింది: రమీజ్ రజా
భారత్ చేతిలో (IND vs PAK) ఓటమిపై మాజీ క్రికెటర్ రమీజ్ రజా (Ramiz Raja) తమ జట్టుపై అసహనం వ్యక్తం చేశాడు. మరో 20 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను చేజార్చుకోవడం తప్పకుండా వారిని తీవ్రంగా బాధించి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘విజయం సాధించలేనప్పుడు కనీసం పోరాడాలి. పాక్ జట్టు అదే చేయలేకపోయింది. తప్పకుండా వారిని ఇది తీవ్రంగా బాధిస్తుంది. మచ్చగా మిగిలిపోతుంది. మూడు విభాగాల్లోనూ భారత్ ఎదుట తేలిపోయారు. దీనిపై పాక్ జట్టు తీవ్రంగా శ్రమించాలి. పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోవం వల్లే ఓడిపోయామని చెప్పడం తగదు. ఈ మ్యాచ్లో మానసికంగా దెబ్బతినడమే కాకుండా నైపుణ్యపరంగానూ ఘోరంగా విఫలమయ్యారు’’ అని రమీజ్ రజా విమర్శించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్