Covid: కుటుంబమంతా ఛిన్నాభిన్నమైంది: మహిళా క్రికెటర్ వేద
కొవిడ్-19 తమ జీవితాలను పూర్తిగా కుదిపేసిందని టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి తెలిపింది. తన తల్లి, సోదరి చనిపోవడంతో పూర్తిగా విషాదంలో మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
బెంగళూరు: కొవిడ్-19 తమ జీవితాలను పూర్తిగా కుదిపేసిందని టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి తెలిపింది. తన తల్లి, సోదరి చనిపోవడంతో పూర్తిగా విషాదంలో మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య పరిస్థితి ఎంతో కీలకమని వెల్లడించింది. ఇప్పుడిప్పుడే ఆ బాధల నుంచి కోలుకుంటున్నానని వివరించింది.
వేద కృష్ణమూర్తి కుటుంబం బెంగళూరులో నివసిస్తోంది. ఆమెకు తప్ప కుటుంబంలో చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మందికి కొవిడ్ సోకింది. దాంతో వైద్యానికి సంబంధించిన ప్రతిదీ తనే చూసుకుంది. అయినప్పటికీ వేద తల్లి, సోదరి మృతిచెందడం అందరినీ కలచివేసింది.
‘విధి ఎలా ఉంటే అలా జరుగుతుందని నా నమ్మకం. కానీ మా అక్క ఇంటికి తిరిగొస్తుందనే అనుకున్నా. ఆమె కూడా చనిపోవడంతో నేను పూర్తిగా చితికిపోయా. మా కుటుంబమంతా ఛిన్నాభిన్నం అయింది. అప్పుడు నేనెంతో ధైర్యవంతురాలిలా ఉండాలనుకున్నాను. జీవితం ఎదురొడ్డిన ఆ పరీక్షా సమయంలో బాధల నుంచి బయట పడేందుకు ప్రయత్నించాను. కానీ ఆ బాధ మళ్లీ మళ్లీ వెంటాడింది’ అని వేద తెలిపింది.
‘ఆ సమయంలో నా ట్విటర్ ఫీడ్ చూస్తే ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు అర్థమైంది. కష్టాలు ఎదురైనప్పుడు మానసికంగా బలంగా ఉండటం అవసరం. కొవిడ్తో చనిపోవడానికి ముందు మా అక్క వత్సల భయంతో గుండెపోట్లు తెచ్చుకుంది. మా అమ్మ కూడా భయపడే ఉంటుంది. ఆమె చనిపోవడానికి ముందురోజు రాత్రి మా ఇంట్లో పిల్లలు సహా అందరికీ కొవిడ్ సోకిన విషయం తెలుసుకుంది. అది కూడా ఆమెపై ప్రభావం చూపించివుండవచ్చు’ అని వేద పేర్కొంది.
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న చాలామందికి మానసిక ఆరోగ్యం గురించి తెలుసని వేద తెలిపింది. ఒకవేళ వ్యవస్థ నుంచి సహకారం రాకపోయినా మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించింది. తాను ఇబ్బందులు పడ్డప్పుడు అలా సాయం తీసుకున్నట్టు వెల్లడించింది. కష్ట సమయంలో ఫోన్ చేయని వాళ్ల గురించి తాను పట్టించుకోవడం లేదని తెలిపింది. తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేసింది. బీసీసీఐ కార్యదర్శి జే షా నుంచి ఫోన్కాల్ ఊహించలేదని, బెంగళూరుకు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పారంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్