T20 WC 2024: పొట్టి కప్లో భారత్కు ఆ టీమ్ల నుంచి గట్టి పోటీ: యువీ, గంభీర్
ఫైనల్కు చేరుతున్నా కప్ను సాధించడంలో మాత్రం టీమ్ఇండియా (Team India) ఇబ్బంది పడుతోంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్తోనైనా (T20 World Cup 2024) ఆ లోటును తీర్చుకోవాలని టీమ్ఇండియా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన టీమ్ఇండియా (Team India).. ఆసీస్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) రూపంలో మరో మెగా సమరం మొదలు కానుంది. వెస్టిండీస్, యూఎస్ఏ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి కప్ను దక్కించుకోవాలంటే భారత్ తీవ్రంగా కష్టపడాల్సిందేనని మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. 2013 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీని టీమ్ఇండియా ముద్దాడలేకపోయింది. పలుమార్లు ఫైనల్కు చేరినా నిరాశ తప్పలేదు. వచ్చే టీ20 ప్రపంచకప్లోనూ భారత్కు కఠిన సవాల్ తప్పదని మాజీలు పేర్కొన్నారు. ఓ క్రీడాఛానెల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో యువీ, గంభీర్ పాల్గొన్నారు. ‘టీ20 ప్రపంచకప్లో భారత్కు భారీ ముప్పు ఏ జట్టు నుంచి ఉంటుంది?’ అనే ప్రశ్నకు వారిద్దరూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
‘‘మూడు జట్ల నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. అందులో అఫ్గానిస్థాన్ ఒకటి. యూఎస్ఏ పిచ్ పరిస్థితులు వారికి అనుకూలంగా ఉంటాయి. అందుకే అఫ్గాన్ అత్యంత ప్రమాదకరమైన టీమ్. ఇక ఆసీస్ ఎప్పుడూ డేంజరస్. కీలకమైన మ్యాచుల్లో ప్రభావం చూపించే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఇంగ్లాండ్ కూడా తీవ్రమైన పోటీనిస్తుంది. టీ20 క్రికెట్ను ఆడే విధానం అద్భుతంగా ఉంటుంది’’ అని గంభీర్ అన్నారు.
‘‘గంభీర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. కానీ, నా దృష్టిలో మాత్రం దక్షిణాఫ్రికాకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవలేదు. ఇటీవల ఆ జట్టు ఆటతీరు అద్భుతంగా ఉంది. వన్డే ప్రపంచ కప్లో సఫారీ జట్టు ప్రదర్శనను చూశాం. పాకిస్థాన్ కూడా చాలా డేంజరస్ జట్టే’’ అని యువీ అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ పేరును యువీ ప్రస్తావించడంతో గంభీర్ స్పందించాడు. ‘‘పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ అత్యంత చెత్తగా ఉంది. వన్డే ప్రపంచ కప్లో వారు ఓడిపోవడానికి ఇదీ ఓ కారణం. ఇటీవల అంతర్జాతీయ మ్యాచుల్లో ఆ జట్టు ఫీల్డింగ్ ప్రదర్శన నాసిరకమే. ఒకవేళ వారు టీ20 ప్రపంచకప్లో పోటీ ఇవ్వాలని భావిస్తే మాత్రం ఆ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. ఇప్పటి వరకు ఎక్కువ సార్లు భారత్ ఫైనల్స్కు చేరుకుంది. గత ఐదారేళ్ల వ్యవధిలో టీమ్ఇండియాలా పాకిస్థాన్ తుది పోరుకు అర్హత సాధించలేదు. భారత్ త్రుటిలో కప్లను చేజార్చుకుంది. ఈసారి మాత్రం టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంటుందనే ఆశాభావంతో ఉన్నా’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్