FIFA: అబూబాకర్ను ఎందుకు పంపేశారు? రూల్స్ ఏం చెబుతున్నాయ్?
ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో బ్రజిల్తో జరిగిన మ్యాచ్లో కామెరూన్ కెప్టెన్ అబూబాకర్ అద్భుతమైన గోల్ చేశాడు. కానీ, అతడిని రిఫరీ రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేశాడు. ఎందుకో తెలుసా?అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఇంటర్నెట్డెస్క్: ఫిఫా (FIFA) ప్రపంచకప్ గ్రూప్ దశ చివరి మ్యాచ్లో అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన బ్రెజిల్కు కామెరూన్ షాకిచ్చింది. మ్యాచ్ను 0-1తేడాతో కైవసం చేసుకుంది. 1998 తర్వాత గ్రూప్ దశలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న బ్రెజిల్ వేగానికి బ్రేక్ వేసింది. మ్యాచ్ చివర్లో అద్భుతమైన గోల్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చిన కామెరూన్ కెప్టెన్ అబూబాకర్(Aboubakar)ను రిఫరీ గ్రౌండ్ నుంచి బయటకు పంపేశాడు. ఎందుకో తెలుసా? గోల్ చేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా టీషర్ట్ విప్పి అతడు సంబరాలు చేసుకున్నాడు. దీంతో అతడికి రిఫరీ తొలుత ఎల్లో కార్డు చూపించాడు. అయితే అప్పటికే ఎల్లో కార్డు ఎదుర్కొన్న అతడికి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపాడు.
రూల్స్ ఏం చెబుతున్నాయి?
సాధారణంగా గేమ్ ఆడేటప్పడు ఆటగాళ్లు లోపల టీషర్ట్ ధరించి, దానిపై జెర్సీ వేసుకుంటారు. అయితే, టీ షర్ట్పై రకరకాల గుర్తులు వేసి, వాటిని రాజకీయ ప్రచారాలకు వాడుకుంటున్నారన్న వాదనలు వినిపించడంతో.. ఫిఫా చట్టంలో 2004లో సరికొత్త నిబంధనలను తీసుకొచ్చారు. గోల్ సాధించినప్పుడు సెలబ్రేట్ చేసుకునే హక్కు ప్రతి ఆటగాడికీ ఉంటుందని, అయితే, ఇది మితిమీరకూడదన్న ఉద్దేశంతోనే నిబంధనలను రూపొందించినట్లు ఫిఫా చట్టం చెబుతోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే హక్కు రిఫరీకి ఉంటుంది. అయితే, ఎలాంటి సందర్భాల్లో ఆటగాళ్లను హెచ్చరించవచ్చన్నదానిపైనా ఫిఫా చట్టం స్పష్టత ఇచ్చింది.
- గోల్ విషయంలో రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, ఆయన్ని రెచ్చగొట్టేలా మాట్లాడినా ఆటగాడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. రిఫరీకి బాధకలిగించేలా ఆటగాడే కొన్ని అభ్యంతరకరమైన సంజ్ఞలు చేసినా ఇది వర్తిస్తుంది.
- గోల్ చేసిన ఆనందంలో ఆటగాడు.. గ్రౌండ్ చుట్టూ ఏర్పాటు చేసిన కంచెపైకి ఎక్కి సెలబ్రేట్ చేసినా క్రమశిక్షణను అతిక్రమించినట్టే.
- మైదానంలో షర్టు తీసేసినా, లేదా షర్టును పైకెత్తి తలను కవర్ చేసినా అతడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లే పరిగణిస్తారు.
- ఆటగాడు తన తల, ముఖం కనిపించకుండా ఏదైనా మాస్క్ ఉపయోగించినా అతడిని హెచ్చరించే హక్కు రిఫరీకి ఉంటుంది.
- ఒకే గేమ్లో ఒక ఆటగాడు రెండుసార్లు ఎల్లో కార్డు ఎదుర్కొంటే దానిని రెడ్ కార్డుగా పరిగణించి అతడిని గ్రౌండ్ నుంచి బయటకు పంపిస్తారు. అంతేకాకుండా అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు అనుమతించరు. గేమ్ ఏ దశలో ఉన్నా.. మిగతా ఆటగాళ్లతోనే ఆ జట్టు ఆటను కొనసాగించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.