WI vs IND: మరో 45 పరుగులు చేస్తే.. యశస్వి ఖాతాలో అరుదైన ఘనత!
విండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీతో కదం తొక్కాడు. ఇలా అరంగేట్రంలోనే శతకం బాదిన 17వ భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అయితే, ఇంకొన్ని పరుగులు చేస్తే పదేళ్లుగా ఉన్న రికార్డు బద్దలు కావడంతోపాటు తొలి బ్యాటర్గా నిలుస్తాడు.
ఇంటర్నెట్ డెస్క్: అరంగేట్ర టెస్టులోనే భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. విండీస్ గడ్డపై (WI vs IND) వారి బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొని పరుగులు చేస్తున్న యశస్వి మరో అరుదైన ఘనతను సాధించేందుకు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాడు. ప్రస్తుతం 143 పరుగులతో కొనసాగుతున్న యశస్వి.. మరో 45 పరుగులు చేస్తే భారత్ తరఫున అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ (187) ఉన్నాడు. అతడి తర్వాత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (177) ఉన్నాడు. యశస్వి 57 పరుగులు జోడిస్తే భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు డెబ్యూ చేసిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు అవకాశం ఉంది.
సచిన్, గిల్ను అధిగమించి..
విండీస్తో టెస్టు అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ను అధిగమించాడు. అతడు టెస్టు డెబ్యూ చేసేనాటికి ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో సగటు విషయంలో వారిద్దరిని యశస్వి దాటేశాడు. సచిన్ 70.18 సగటుతో 9 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన తర్వాత టెస్టుల్లోకి వచ్చాడు. ఇక గిల్ 68.78 సగటుతో 23 మ్యాచ్లు ఆడాక అవకాశం దక్కింది. ఇప్పుడు యశస్వి 15 మ్యాచుల్లో 80.21 సగటుతో ఆడి టెస్టుల్లోకి అడుగు పెట్టాడు. అయితే, ఈ విభాగంలో మాజీ క్రికెటర్లు వినోద్ కాంబ్లి (27 మ్యాచ్లు, 88.37 సగటు), ప్రవీణ్ ఆమ్రె (23 మ్యాచ్లు, 81.23 సగటు) అందరి కంటే ముందున్నారు.
ఇదీ చదవండి.. నీ సెంచరీ వెనుక ఎన్నో కష్టాలు..
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. విండీస్ను మొదటి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్లోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు రోజుల ఆట ముగిసిన తర్వాత టీమ్ఇండియా 312/2 స్కోరుతో కొనసాగుతోంది. క్రీజ్లో యశస్వి జైస్వాల్ (143*), విరాట్ (36*) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..