Yashasvi Jaiswal: నీ సెంచరీ వెనుక ఎన్నో కష్టాలు.. యశస్విపై ప్రశంసల జల్లు
అరంగేట్రం చేసిన తొలి టెస్టు మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టాడు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్లో ఘనంగా కెరీర్ను ప్రారంభించిన యశస్వి జైస్వాల్పై (Yashasvi Jaiswal) ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో అదరగొట్టిన టీమ్ఇండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (143*)పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో నిలకడైన ఆటతీరుతో జైస్వాల్ అందర్నీ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (103) తో కలిసి తొలి వికెట్కు 229 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో సంజయ్ బంగర్ - వీరేంద్ర సెహ్వాగ్ల 201 పరుగుల పార్టనర్షిప్ను రోహిత్-యశస్వి జోడీ అధిగమించింది. అలాగే అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో ఓపెనర్గానూ యశస్వి రికార్డు సృష్టించాడు. దీంతో అతడిని ప్రశంసిస్తూ మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
‘‘యశస్వి సెంచరీతో సంబరాలు చేసుకునే కోట్లాది భారతీయ అభిమానులతో నేను కూడా కలిసిపోయా. యశస్వి ఎన్నో కష్టాలను అధిగమించి ఇక్కడకు వచ్చాడు. ఆత్మవిశ్వాసం, గొప్ప క్యారెక్టర్తో అందర్నీ ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ చేయడం అద్భుతం’’ - ఇయాన్ బిషప్, విండీస్ క్రికెట్ దిగ్గజం
‘‘నీ టెస్టు కెరీర్ సూపర్గా ప్రారంభమైంది. వెల్డన్ యశస్వి. కెప్టెన్ రోహిత్ నుంచి మరో అద్భుతమైన సెంచరీ వచ్చింది’’ - సచిన్
‘‘అద్భుతమైన కెరీర్కు నాంది పడింది. ఇలాగే కొనసాగాలి’’ - ఇర్ఫాన్ పఠాన్
‘‘నీదైన శైలిలో టెస్టు కెరీర్ను ప్రారంభించావు. ఇలాంటి సెంచరీతో అరంగేట్రం చేయడం అద్భుతం. భవిష్యత్తులోనూ ఇంకా మంచి ఇన్నింగ్స్లు ఆడాలి’’ - ఆకాశ్ చోప్రా
‘‘నీ ఆటతీరు అద్భుతం. ఇన్నింగ్స్ చూసిన తర్వాత గర్వంగా అనిపిస్తోంది’’ - రాజస్థాన్ రాయల్స్
వారికి అంకితం: యశస్వి
మొదటి టెస్టులోనే సూపర్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్ ఇప్పుడు హాట్టాపిక్గా మారిపోయాడు. అయితే తన సెంచరీ వెనుక ఎంతోమంది కృషి ఉందని తెలిపాడు. ‘‘ఇలాంటి సమయంలో ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినందుకు ఆనందంగా ఉన్నా. భారత జట్టులో స్థానం దక్కడం చాలా కష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నా. ఆ దేవుడి దయ, నా తల్లిదండ్రుల కష్టంతో ఇక్కడికి చేరుకున్నా. అందుకే నా తొలి సెంచరీని వారికి అంకితమిస్తున్నా. ఇంతకంటే మరే గొప్ప ఘనత ఉండదు’’ అని యశస్వి అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: కోహ్లి
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.