IND vs ENG: అయ్యర్.. మంచి ఛాన్స్ను మిస్ చేసుకొన్నావు.. ఇక కష్టమే: జహీర్
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: జట్టులో కొనసాగించడం అవసరమా? అనే విమర్శల మధ్య వచ్చిన అవకాశాన్ని భారత క్రికెటర్ శుభ్మన్ గిల్ (Shubman Gill) అందిపుచ్చుకోగా.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మాత్రం మిస్ చేసుకుని నిరాశపరిచాడు. దీంతో ఇంగ్లాండ్తో (IND vs ENG) చివరి మూడు టెస్టులకు అతడిని ఎంపిక చేయడం కష్టమేనని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండోటెస్టులో శ్రేయస్ 29, 27 పరుగులు చేశాడు. శుభారంభాలను మరోసారి సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరిసారిగా 2022 డిసెంబర్లో శ్రేయస్ హాఫ్ సెంచరీ మార్క్ను తాకాడు. దీనిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఇప్పుడు ఫామ్ ఎంత కీలకమో శ్రేయస్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జట్టుతోపాటు అతడికీ చాలా ముఖ్యం. ఇప్పటికే చాలాసార్లు మంచి అవకాశాలు వచ్చాయి. కేవలం ఒకే ఒక్క పేసర్ మాత్రమే ఇంగ్లాండ్ జట్టులో ఉన్నాడు. మిగతావారంతా స్పిన్నర్లే. ఇలాంటప్పుడు కాస్త కుదురుకుని పరుగులు రాబడితే బాగుండేది. చివరి మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పుడీ ప్రదర్శనతో.. అతడిని జట్టులో ఉంచాలా? వద్దా? అనే సందిగ్ధత లేకుండా సెలక్టర్లకు ఓ క్లారిటీ ఇచ్చినట్లు అనిపించింది. కేఎల్ రాహుల్ వచ్చే అవకాశాలున్నాయి. మరో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్లో గిల్ శతకం సాధించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు’’ అని జహీర్ తెలిపాడు.
గిల్కు స్వల్ప గాయం..
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శుభ్మన్ గిల్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో నాలుగో రోజు మైదానంలోకి దిగలేదు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ అప్పుడే గిల్కు గాయమైనట్లు తెలుస్తోంది. అయినా సరే, భారత రెండో ఇన్నింగ్స్లో అద్భుత శతకంతో గిల్ ఆకట్టుకున్నాడు. గాయం తీవ్రతపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ