Faf duplessis: ఫైనల్లో ఆడేందుకు మాకన్నా రాజస్థాన్కే ఎక్కువ అర్హత: డుప్లెసిస్
భారత టీ20 లీగ్ ఫైనల్లో ఉండేందుకు తమకన్నా రాజస్థాన్కే ఎక్కువ అర్హత ఉందని బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: భారత టీ20 లీగ్ ఫైనల్లో ఆడేందుకు తమకన్నా రాజస్థాన్కే ఎక్కువ అర్హత ఉందని బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్ అన్నాడు. గతరాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో బెంగళూరుపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా బెంగళూరు ప్లేఆఫ్స్ చేరినా ఫైనల్కు వెళ్లలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన బెంగళూరు కెప్టెన్.. ఈ ఓటమి నిరాశ కలిగించినా తమ ఆటగాళ్లు ఈ సీజన్లో బాగా ఆడారని మెచ్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తాము 180 పరుగులు చేసుంటే బాగుండేదని పేర్కొన్నాడు.
‘ఇది బెంగళూరుకు చాలా గొప్ప సీజన్. మా ఆటపట్ల గర్వంగా ఉంది. మేం ఎక్కడికివెళ్లినా అభిమానుల మద్దతు కూడా బాగుంది. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సీజన్లో మా ఆటగాళ్లు హర్షల్ పటేల్, దినేశ్ కార్తీక్, రజత్ పటీదార్ వంటి వారు అద్భుత ప్రదర్శన చేశారు. కొందరు టీమ్ఇండియాకు ఎంపికయ్యారు. వీరితో పాటు మరికొంతమంది నాణ్యమైన యువ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో మరో 3 ఏళ్ల వరకు మాకు కచ్చితమైన ప్రణాళిక ఉంది. అందుకోసం వీలైనంత మేర కష్టపడతాం. ఈ క్రమంలో యువ ఆటగాళ్లు మొదట కొంచెం ఇబ్బందిపడ్డా తర్వాత సూపర్స్టార్లు అవుతారు. రజత్ కూడా అలా మెరిసిన వాడే. టీమ్ఇండియాకు ఇప్పుడున్న ఆటగాళ్లతో మూడు జట్లను ఆడించవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఓటమితో కచ్చితంగా నిరాశ చెందాం. కానీ, రాజస్థాన్ లాంటి మేటి జట్టుతో పోటీపడ్డాం. మాకన్నా ఆ జట్టే ఫైనల్లో ఉండేందుకు ఎక్కువ అర్హత కలిగిఉంది’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
మరోవైపు భారత్లో క్రికెట్కు విశేషమైన ఆదరణ ఉందని, తాము ఎక్కడికి వెళ్లినా అభిమానుల మద్దతు లభించిందని బెంగళూరు కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే లీగ్ స్టేజ్లో ముంబయి-దిల్లీ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్లోనూ అభిమానులు బెంగళూరు పేరు అరుస్తూ కనిపించారని చెప్పాడు. ఒక క్రికెటర్కు భారత్లో లభించే మద్దతు ఎనలేనిదని పేర్కొన్నాడు. ఇలాంటి ప్రేమాభిమానాలు చూసి ఆశ్చర్యపోతామని తెలిపాడు. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగొస్తామని డుప్లెసిస్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్