logo

మొగిలయ్యకు సజ్జనార్‌ సన్మానం

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర మొగిలయ్యను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని బస్‌ భవన్‌లో బుధవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌  సన్మానించారు. ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా

Updated : 27 Jan 2022 06:14 IST

ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో మొగిలయ్య

లింగాల, న్యూస్‌టుడే : పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర మొగిలయ్యను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని బస్‌ భవన్‌లో బుధవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌  సన్మానించారు. ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకొన్న ఈ కళను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఆర్టీసీ సంస్థ అధికారులు సూర్యకిరణ్‌, వెంకట్‌రెడ్డి, అచ్చంపేట ఆర్టీసీ డీఎం భానుప్రసాద్‌, ఆర్టీసీ సంక్షేమ బోర్డు సభ్యుడు చంద్రయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని